ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒలంపియాడ్ లో విజేతలుగా సెయింట్ థెరిస్సా విద్యార్థులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 04:13 PM

శ్రీ శ్రీనివాస రామానుజన్ మ్యాథమెటిక్స్ ఒలంపియాడ్ పరీక్షల్లో ఆత్మకూరు మండల కేంద్రంలోని సెయింట్ థెరిస్సా పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఆ పాఠశాల  కరస్పాండెంట్ లిస్మేరీ, ప్రిన్సిపల్ జాయిస్ అన్నారు. ఆదివారం హనుమకొండ లో ఎస్ఆర్ఎఫ్ 1929 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ధనసరి అనసూయ సీతక్క, కేయూ రిజిస్టార్ రామచందర్ , ఏసీపీ ప్రదీప్ రెడ్డి హాజరయ్యారు.
వీరి చేతుల మీదుగా సెయింట్ తెరిసా పాఠశాల విద్యార్థులు, 8వ తరగతి చిట్టి బొమ్మల నిక్షిత స్టేట్ స్టాపర్ గా, పదవ తరగతి కితిడి నితిన్ రెడ్డి జిల్లా టాపర్గా, మోతె కీర్తన, బూర చంద్ర, పరిపాటి హర్షిత్ రెడ్డి, వల్లెపు అక్షర, ఇండ్ల అశ్వద్వర్మ, జిల్లా కన్సోలేషన్ బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్, కరెస్పాండెంట్, ఉపాధ్యాయులు విజేతలుగా నిలిచి బహుమతులు పొందిన విద్యార్థులను అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa