ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బర్డ్ ఫ్లూ భయం, ఖాళీగా కనపడుతున్న చికెన్ దుకాణాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 07:17 PM

ఆయా జిల్లాల ఎఫెక్ట్ తో మిగతా జిల్లాల్లో ప్రజలు కూడా చికెన్ తినడం మానేస్తున్నారు. విశాఖలో వారం రోజుల నుండి బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్స్ తో చికెన్ కొనుగోలు చేయడం లేదంటూ విశాఖపట్నంలోని చికెన్ నిర్వాహకులు నాయుడు తెలుపుతున్నారు. విశాఖపట్నంలో కోళ్లకు ఎటువంటి వ్యాధులు రానప్పుడు ఫ్లూ భయంతో చికెన్ ఎవరూ తినడం లేదంటూ చెబుతున్నారు. గత 15 రోజులుగా తమకు బేరాలు కూడా లేవంటూ చెబుతున్నారు. ఆదివారం మంగళవారం వచ్చిందంటే అధిక శాతం చికెన్ ప్రియులు అందరూ కూడా వచ్చి కొనుగోలు చేసేవారని చెబుతున్నారు. ఇప్పుడు ఆదివారం అయినా సరే ఖాళీగా ఉంటే నన్ను తప్ప ఎవరూ కొనుగోలు చేయడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం చికెన్ కేజీ 180 రూపాయలు ఉన్నప్పటికీ ఎవరూ తినడం లేదని అంటున్నారు. చికెన్ తో పాటు కోడిగుడ్లు కూడా కొనుగోలు చేయడం మానేశారని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa