శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా లక్షలాదిమంది శివ స్వాములతో ఇసుకేస్తే రాలనంత భక్తులతో క్షేత్రమంతా కిటకిటలాడుతుంది. లక్షలాది శివ భక్తులు పాదయాత్రగా, ఇతర రవాణా సౌకర్యాలతో లక్షలాదిగా తరలివచ్చి ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామి అమ్మవారిని దర్శించుకుంటారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు జరుగుతాయి. ఫిబ్రవరి 26న శివరాత్రి పాగాలంకరణ, 27న రథోత్సవం, 28న శివ దీక్ష విరమణలు జరుపనున్నారు. శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఎన్నో తరాలుగా నిర్వహించే పాగలంకరణ ఒక ప్రత్యేకమైన ఆచారం. శివుడు లోక కళ్యాణం కోసం జరిపే కళ్యాణ మహోత్సవానికి తయారయ్యేటువంటి రీతిలో శివుడికి తలపాగా చుట్టడం పాగాలంకరణ. ఇది ఎన్నో తరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం. శ్రీశైల క్షేత్రంలో ఈరోజు కూడా వైభవంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. అలాగే ఆలయ విమాన గోపుర శిఖరంపై నవనందులకు పాగాలంకరణ నిర్వహిస్తారు. ఈ విశేష కార్యక్రమం మహా శివరాత్రి రోజున రాత్రి 10 గంటల తర్వాత ప్రారంభమవుతుంది అని అర్చకులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa