ప్రియుడి కోసం పాకిస్థాన్ నుంచి భారత్లోకి అక్రమంగా వచ్చిన సీమా హైదర్ జీవితంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారత్లోకి వచ్చి పబ్జీ ప్రియుడ్ని పెళ్లాడి.. మతం మార్చుకుంది. ప్రస్తుతం ఈ జంట ఏకంగా ఆరు యూట్యూబ్ ఛానళ్లను నడుపుతున్నారట. ఇందులో విభిన్నమైన కంటెంట్ అందిస్తూ.. వ్యూస్ రాబట్టి లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారట. తాజాగా, ఓ జాతీయ మీడియాతో సీమా మాట్లాడుతూ... యూట్యూబ్ మొదలుపెట్టిన తర్వాత తనకు తొలి సంపాదనగా రూ. 45,000 వచ్చిందని చెప్పింది. అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం నెలా రూ. 80 వేల నుంచి రూ. 1 లక్షకు పైగా సంపాదిస్తున్నామని చెబుతోంది.
యూట్యూబ్ వ్యూస్, లైవ్ స్ట్రీమింగ్ సమయంలో డొనేషన్లు, స్పాన్సర్ చేసిన వీడియోలు, బ్రాండ్ ప్రమోషన్ సహా వివిధ మార్గాల ద్వారా ఈ మొత్తం వస్తోందని సీమా తెలిపింది. మొత్తం ఆరు యూట్యూబ్ ఛానెల్స్ మొదలుపెట్టిన సీమా, సచిన్లు . ఇందులో తమ జీవన విధానం, కుటుంబ జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వీడియోలుగా చేసి పోస్ట్ చేస్తున్నారు. ఈ ఛానెళ్లకు మొత్తం 17 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉండగా.. ఒక్కో వీడియోకు సగటున 25 వేల వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్ ద్వారా ఆదాయం ఆశాజనకంగా ఉండటంతో తన ఉద్యోగానికి సచిన్ రాజీనామా చేశాడు. పూర్తిగా యూట్యూబ్పైనే ఫోకస్ పెట్టి.. మరింత భిన్నమైన కంటెంట్ వీడియోలను క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నారు.
పాకిస్థాన్కు చెందిన సీమా హైదర్.. ఉత్తర్ ప్రదేశ్కు చెందిన సచిన్ మీనాలకు ప్రముఖ ఆన్లైన్ గేమ్ పబ్జీలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే తన భర్తను వదిలేసి.. పిల్లలను తీసుకుని నేపాల్ మీదుగా ఆమె భారత్కు వచ్చింది. నేపాల్లోనే రహస్యంగా ఈ జంట వివాహం చేసుకుంది. తమ ప్రేమకు గుర్తుగా మొదటి బిడ్డ పుట్టబోతున్నాడంటూ ఇటీవల సీమా ఒక వీడియో కూడా విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa