ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దరిద్రం అబుదాబి తీసుకెళ్లి మరణశిక్ష వేసింది

national |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 08:25 PM

జీవితంపై ఎన్నెన్నో ఆశలతో ఓ వ్యక్తి మాటలు నమ్మి అబుదాబి వెళ్లింది. చివరకు పని మనిషిగా మారి జీవితాన్ని నరక ప్రాయం చేసుకుంది. అది చాలదన్నట్లు ఓ కేసులో ఇరుక్కోగా.. అక్కడి కోర్టు సదరు మహిళకు ఉరిశిక్ష వేసింది. చివరి కోరిక ఏంటని అడగ్గా.. తల్లిదండ్రులతో మాట్లాడాలని ఉందని చెప్పింది. ఈక్రమంలోనే పోలీసులు వారికి ఫోన్ చేయగా.. అమ్మా, నాన్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.


నేను ఏ తప్పూ చేయలేదు.. కానీ చనిపోతున్నా, ఇదే నా చివరి ఫోన్ కాల్ అంటూ చెప్పి పెట్టేసింది. ఆపై ఏం జరిగిందనేది ఆ ముసలి తల్లిదండ్రులకు తెలియక.. గుండెలవిసేలా రోదిస్తున్నారు. కూతురు బతికే ఉందా, చనిపోయిందా అనేది కూడా ఎవరూ చెప్పట్లేదు. ప్రతీ ఒక్కరి గుండెల్ని మెలిపెట్టే ఈ కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఉత్తర ప్రదేశ్‌లోని బండా జిల్లా గోయ్రా ముగ్లి గ్రామానికి చెందిన షెహజాది 33 ఏళ్ల వయసు. అయితే 2020లో ఈమె ఇంట్లో వంట చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈక్రమంలోనే ఒళ్లంతా కాలిపోగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మొహమంతా కాలిన గాయాలతో అంద వికారంగా తయారైన అదృష్టవశాత్తు ప్రాణాలు నిలిచాయి. కొన్నాళ్ల తర్వాత షెహజాదికి.. ఉజైర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇక్కడ జీవితం ఇలాగే ఉంటుంది.. అబుదాబి వెళ్తే బాగా సంపాదించుకుని హాయిగా బతకొచ్చని చెప్పాడు. ఉజైర్ మాటలు నమ్మిన ఈమె దుబాయ్ వెళ్లేందుకు సిద్ధం అయింది.


ఈక్రమంలోనే 2021లో ఆగ్రాకు తీసుకెళ్లి తన చుట్టాలు అయిన ఫైజ్, నాడియా దంపతులకు అమ్మేశాడు ఉజైర్. ఇక చేసేదేమీ లేక షెహజాది వాళ్లతో పాటు అబుదాబీకి వెళ్లింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఫైజ్, నాడియా దంపతులకై మానవ అక్రమ రవాణా కేసు నమోదు అయింది. అయితే ఇదే సమయంలో షెహజాది వారి బిడ్డ బాగోగులు చూస్తూ పని మనిషిగా పనులు చేస్తోంది. కోర్టు కేసు తేలకముందే ఈ చిన్నారి చనిపోవడంతో.. ఫైజ్, నాడియా దంపతులు షెహజాదిపై కేసు పెట్టారు. కావాలనే ఆమె తమ బిడ్డను చంపిందంటూ ఆరోపించారు.


ఈక్రమంలోనే అక్కడి పోలీసులు షెహజాదిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. తన తప్పేమీ లేదని.. వారు ఇచ్చిన మందులు వేయడం వల్లే బిడ్డ చనిపోయిందని షెహజాది వాదించింది. కానీ అది నమ్మని న్యాయస్థానం ఆమెకు మరణశిక్షను విధించింది. ఈ విషయం తెలుసుకున్న యూపీలోని షెహజాది తండ్రి షబ్బీర్ ఖాన్.. తమ కూతురును కాపాడమంటూ ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేశాడు. రోజూ తిరుగుతూనే ఉన్నాడు.


అయితే ఫిబ్రవరి 16వ తేదీన అక్కడి జైలు అధికారులు షెహజాదిని చివరి కోరిక ఏంటని అడగ్గా.. తల్లిదండ్రులతో మాట్లాడాలని ఉందని చెప్పింది. దీంతో వాళ్లు యూపీలోని ఆమె ఇంటికి ఫోన్ చేయగా.. షెహజాది తల్లిదండ్రులతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయింది. తానే తప్పు చేయలేదని.. ఇంకా కొన్ని గంటల్లోనే చనిపోబోతున్నట్లు వివరించింది. ఇదే నా చివరి ఫోన్ కాల్ అంటూ పెట్టేసింది.


ఆపై వీళ్లు ఫోన్ చేసినా కలవకపోవడం.. తమ బిడ్డకు శిక్ష పడిందా లేదా తెలియక తల్లిదండ్రులు ఇద్దరూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. మరోవైపు బిడ్డను కాపాడాలంటూ రాష్ట్రపతిని, ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే తమ బిడ్డ బతికే ఉందా.. లేక శిక్ష పడి ప్రాణాలు కోల్పోయిందో చెప్పాలని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa