ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్లమెంటు సాక్షిగా ఎంపీ పచ్చి అబద్ధాలు.. రూ.9 లక్షల జరిమానా విధించిన న్యాయస్థానం

international |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 08:33 PM

సింగపూర్‌లోని భారత సంతతి నేత ప్రీతమ్ సింగ్‌కు అక్కడి న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ప్రతిపక్ష నేతగా ఉన్న ఈయన.. పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పినట్లు అభియోగాలు రాగా.. కోర్టు విచారణ చేపట్టింది. ఈక్రమంలోనే ప్రతీమ్ సింగ్ చెప్పినవన్నీ అబద్ధాలని రుజువు కాగా.. అతడిని దోషిగా ప్రకటించింది. అలాగే 14 వేల డాలర్ల సింగపూర్ కరెన్సీని (ఇండియా కరెన్సీ ప్రకారం రూ.9 లక్షలు) జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఈ శిక్ష వల్ల అతడి ఎంపీ పదవిపై అనర్హతా వేటు పడే అవకాశం ఉందని కొందరు చెబుతుండగా.. అలా జరిగే ఛాన్సే లేదని మరికొంత మంది చెబుతున్నారు. మరి ఈ పూర్తి కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రతీమ్ సింగ్ మాజీ సహోద్యోగి రయిసా ఖాన్ 2021లో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో అబద్ధాలు చెప్పారు. ముఖ్యంగా తను ఓ అత్యాచార బాధితురాలితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లానని.. రెండుసార్లు తెలిపారు. అక్కడే ఓ పోలీసు అధికారి బాధితురాలి దుస్తులు, మద్యం సేవించడంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం చూశానని వివరించారు. కానీ అవన్నీ తప్పుడు వార్తలేనని ప్రజాప్రతినిధులు కామెంట్లు చేశారు. ఈక్రమంలోనే ఆమెపై కేసు నమోదు అయింది.


అవన్నీ తప్పుడు వార్తలేనని, తాను నిజంగానే అబద్ధం చెప్పినట్లు రయిసా ఖాన్.. ఎంపీ ప్రీతమ్ సింగ్‌కు వివరించింది. ఇవి తప్పని చెబితే పార్టీ పరువు పోతుందని భావించిన సింగ్.. ఇదే అబద్ధాన్ని చెబుతూ మాట్లాడాలని చెప్పారట. అయితే సెప్టెంబర్ నెలలో రెండోసారి పార్లమెంట్ సమావేశాలు జరగ్గా.. షింగిల్స్ వ్యాధి కారణంగా రయిసా ఖాన్ సమావేశాలకు హాజరు కాలేకపోయారు. కానీ అక్టోబర్ 3వ తేదీన మళ్లీ ఆమెను కలిసి మరుసటి రోజు జరిగి సమావేశాల్లో అబద్ధమే చెప్పాలని ప్రీతమ్ సింగ్ తెలిపారట.


ఈక్రమంలోనే రయిసా ఖాన్ తన పదవికి, పార్టీకీ రాజీనామా చేసింది. ఆపై ప్రీతమ్ సింగ్ ఆమెతో చెప్పిన విషయాలను మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో 2024 మార్చి 19వ తేదీన సింగ్‌పై కేసు నమోదు అయింది. ఈక్రమంలోనే విచారణ చేపట్టిన స్థానిక న్యాయస్థానం.. ప్రీతమ్ సింగ్ తప్పు చేసినట్లు నిర్ధారించింది. ఆపై 14,000 డాలర్లు (సింగపూర్ కరెన్సీ) జరిమానా విధించింది. అయితే ఈ కేసు వల్ల అతడు పదవీపై వేటు పడుతుందని అంతా అనుకుంటున్నారు.


కానీ సింగపూర్ రాజ్యాంగం ప్రకారం.. కనీసం 10 వేల డాలర్లు (సింగపూర్ కరెన్సీ), ఏడాది జైలు శిక్ష పడితేనే ఏ ఎంపీ అయినా పదవిని కోల్పోవచ్చని.. లేదా ఐదేళ్ల పాటు పదవికి పోటీ చేయకుండా నిషేధించవచ్చని సమాచారం. అయితే ప్రీతమ్ సింగ్‌కు జరిమానా మాత్రమే పడగా.. ఒకే నేరం కిందకు వస్తుందని అనర్హత వేటు పడే అవకాశం లేదని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరబోతుందనేది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa