ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాగునీటి రంగానికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2025, 08:48 AM

 రాష్ట్ర బడ్జెట్‌లో సాగునీటి రంగానికి రూ.30 వేల కోట్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. అందులో సింహాభాగం రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించాలన్నారు. సోమవారం కర్నూలులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1985 తరువాత అప్పటి సీఎం ఎన్టీఆర్‌ హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులకు బీజం వేశారని, నాలుగు దశాబ్దాలు దాటినా వాటిని పూర్తి చేసి ఆయకట్టు స్థిరీకరించకపోవడం బాధాకరమన్నారు. కర్నూలు జిల్లాలో తక్షణ వలసలు ఆపేందుకు చర్యలు తీసుకోవాలన, వేదవతి, ఆర్డీఎస్‌, గుండ్రేవుల ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa