ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుంభమేళాలో మరో అగ్ని ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2025, 12:19 PM

కుంభమేళాలో వరుసగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే మొత్తంగా ఆరు ప్రమాదాలు జరగ్గా.. తాజాగా సోమవారం మరో ప్రమాదం సంభవించింది. సెక్టార్ 18, 19 మధ్య ఉన్న అనేక మండపాలు మంటల్లో చిక్కుకోగా.. అధికారులు వెంటనే స్పందించారు. ప్రజలందరినీ క్షేమంగా బయటకు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. కాగా ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం కోట్లాది మంది ప్రజలు వస్తున్నారు. గంగ, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa