ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్ధులకి ర్యాగింగ్‌పై అవగాహనకల్పించిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2025, 12:21 PM

ఈవ్‌టీచింగ్‌, ఆకతాయి పనులకు పాల్పడితే చర్యలు త ప్పవని సీఐ ఎస్‌కే రోషన హెచ్చరించారు. ఆదివారం ఎస్పీ అశోక్‌కుమార్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటేశ్వర్లు సహకారంతో ,కడప జిల్లా, కమలాపురం పట్టణంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల, జూనియర్‌ కళాశాలల్లో ర్యాగింగ్‌పై అవగాహన కల్పించారు. అక్కడే పాఠశాల, కళాశాల విద్యార్థులు సిబ్బందితో మాట్లాడిన ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఈవ్‌టీజింగ్‌, ఆకతాయిల వల్ల ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈవ్‌టీజింగ్‌ వల్ల చాలా మంది విద్యార్థుల జీవితాలు నాశనమయ్యాయని, ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు. అనంతరం విద్యార్థుల వసతి గదులను సందర్శించి శు భ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ ప్రతా్‌పరెడ్డి, ప్రిన్సిపాల్‌ తులశమ్మ, ఉపాధ్యాయులు అధ్యాపకులు, పోలీసులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com