ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు గుంటూరు మిర్చి యార్డ్ లో పర్యటించనున్న జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 09:53 AM

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మిర్చియార్డులో రైతులను జగన్ పరామర్శించనున్నారు. అయితే జగన్ పర్యటనకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎన్నికల కోడ్ ఉన్న నేపధ్యంలో మిర్చి యార్డులో రాజకీయ ఫోటోలు, ఫ్లెక్సీలు, సమావేశాలు నిర్వహించడం నిషేధం అంటూ మైకులో ప్రచారం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఎన్సౌన్ మెంట్ చేశారు. అయితే జగన్ పర్యటన జరిపేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా జగన్ పర్యటనపై సందిగ్థత నెలకొంది.మిర్చి రైతులను పరామర్శించేందుకు బుధవారం గుంటూరు రానున్న జగన్‌కు ఎన్నికల కమిషన్‌ అనుమతి నిరాకరించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్నందున రాజకీయ కార్యకలాపాలకు అవకాశం ఇవ్వబోమని ఎన్నికల కమిషన్‌ తేల్చి చెప్పింది. అయితే జగన్‌ పర్యటన షెడ్యూలును వైఎస్సార్‌సీపీ విడుదల చేసింది. బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు మిర్చి యార్డుకు వస్తారని 12 గంటల వరకు యార్డులో రైతులతో చర్చించి తరువాత తిరిగి తాడేపల్లికి వెళతారు. కాగా ఎన్నికల కమిషన్‌ అనుమతి నిరాకరించడంతో జగన్ పర్యటనపై సందిగ్ధత నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa