ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్నాలకు కాదు, రైతుల సమస్యలు వినటానికి మాత్రమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 09:54 AM

 మిర్చి ధర పతనంతో ఆవేదన చెందుతున్న రైతులను పరామర్శించేందుకు వైఎస్‌ జగన్‌ గుంటూరుకు బుధవారం రానున్నారు. మిర్చియార్డులో రైతులను జగన్‌ పరామర్శిస్తారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. మంగళవారం సాయంత్రం బృందావన్‌ గార్డెన్స్‌ వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మిర్చి యార్డుకు బుధవారం జగన్‌ వస్తారని రైతుల కష్ట, నష్టాలను తెలుసుకుంటారని, వారి ఆవేదనను వింటారని చెప్పారు. రైతులు తమ సమస్యలను జగన్‌కు వివరిస్తే తద్వారా ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి న్యాయం చేసేందుకు కృషి చేస్తారన్నారు. మరోవైపు, మిర్చి రైతుల పరామర్శకు ఎన్నికల కోడ్ కి సంబంధం లేదని.. తాము పబ్లిక్ మీటింగులు పెట్టడం లేదని.. రైతుల సమస్యలు మాత్రమే వింటామని అంబటి అన్నారు. రైతులకు అండగా ఉంటాం అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa