భైరవకోనను రూ.రెండు కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన భైరవకోనను మంగళవారం వివిధశాఖల అధికారులతో కలిసి సందర్శించారు. ఆలయ పరిసరా లను, జలప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మహా శివరాత్రి సందర్భంగా ఏర్పాట్ల గురించి దేవస్థాన ఈవో వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మహాశివరాత్రి సందర్భంగా దైవదర్శన కోసం దూరప్రాంతాల నుంచి భక్తులు వస్తారన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పా ట్లు చేయాలని అధికారులకు సూచించారు. రాబోవు రోజుల్లో భైరవకోనలో పలు అభివృద్ధి పనులు చేపట్టి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు తీసుకొస్తామన్నారు. శివరాత్రి సందర్భంగా భక్తులు భారీగా వస్తారన్నారు. ఈసందర్భంగా జలపాతం వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలని ఆదేశిం చారు. భక్తుల నడక ప్రాంతంలో రాళ్లగుట్టలను తొల గించాలన్నారు. రోడ్డు మార్గంలో వాహనాల రాకపోక లకు జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలన్నారు. మహిళా భక్తులకు ప్రత్యేక స్నాన, మరుగుదొడ్లు, బస్ పార్కింగ్, విద్యుత్ లైటింగ్ ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. టెంకాయలు తెచ్చుకొనేందుకు ప్లాస్టిక్ కవర్లుకు బదులు క్లాత్ సంచులు తెచ్చుకొనేలా అవగాహన కల్పించా లన్నారు. మంచినీటి వసతి, పారిశుధ్య చర్యలు చేప ట్టాలని సూచించారు. ఈసందర్భంగా ఉత్సవాలకు సం బంధించి వాల్పోస్టర్లను ఆవిష్కరించారు.కార్యక్రమంలో ఆర్డీవో కేశవర్ధన్రెడ్డి, డీఎస్పీ సాయిఈశ్వర్ యశ్వంత్, డీఎల్డీవో పి.శ్రీనివాసరెడ్డి, బోయిళ్ల నారాయణరెడ్డి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa