ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొనసాగుతున్న హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ సర్వే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 11:18 AM

ప్రకాశం జిల్లా ప్రజానీకంలోని అనేక మంది ఆచూకీ తెలియడం లేదు. అలాగే ప్రభుత్వ లెక్కల్లోనూ కనిపించడం లేదు. హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ ప్రక్రియలో దాదాపు 2.14 లక్షల మంది సమాచారం లభించలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇంచుమించు 46.93 లక్షల మంది వివరాలు లభించకపోవడంతో ప్రభుత్వం జిల్లాల వారీగా మళ్లీ సర్వే చేసి లెక్కలు తేల్చాలని ఆదేశించింది. దీంతో ప్రస్తుతం సచివాలయ సిబ్బంది ద్వారా హౌస్‌హోల్డ్‌ సర్వే చేస్తున్నారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 22.88 లక్షల మంది ఉన్నారు. ఈ పన్నెండేళ్లలో మరో 4 లక్షల మంది వరకు పెరిగినట్లు అంచనా. అలాగే మొత్తం 7.81 లక్షల హౌస్‌హోల్డ్‌లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ (ఇంటింటి సర్వే)ను ప్రభుత్వం చేపట్టింది. ప్రతి ఇంటికీ వెళ్లి సచివాలయ సిబ్బంది ఎంతమంది నివాసం ఉంటున్నారు, ఏయే వయస్సులలో, ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఏమి చేస్తున్నారన్నది వారికి ఆధార్‌ నంబర్లు, పాన్‌ నంబర్లు ఇలా అన్ని వివరాలు సేకరించారు. ఈ తరహా సర్వే గతంలోనే చేశారు.జనాభా లెక్కకు, మ్యాపింగ్‌ సర్వేలో వచ్చిన లెక్కలకు తేడాలు ఉన్నాయి. అలా రాష్ట్రంలో సుమారు 46.93 లక్షల మంది వివరాలు లేకపోవడంతో వారిని మిస్సింగ్‌ సిటిజన్‌గా ప్రభుత్వం భావిస్తోంది. అలా జిల్లాలో 2,14,932 మంది ఆచూకీ లభించని వారు ఉన్నారని అంచనా. అంటే అంతమంది సమాచారం ప్రభుత్వ లెక్కల్లో తేలడం లేదు. దీంతో మరోసారి మ్యాపింగ్‌ సర్వేను అప్‌డేట్‌ చేయాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆదేశించింది. తదనుగుణంగా ప్రస్తుతం మళ్లీ సర్వే సాగుతోంది. అలా జిల్లాలోని 7.81 లక్షల గృహాలలో సుమారు 7.28 లక్షల గృహాల సర్వే పూర్తయినట్లు సమాచారం. గతంలో ఇంటింటికి వెళ్లి మళ్లీ మ్యాపింగ్‌ చేసి ఉండటంతో సిబ్బంది తమ వద్ద ఉన్న గతంలో చేసిన సర్వే వివరాలను సరిచూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa