ఉపాధి కోసం పరాయి దేశానికి వెళ్లిన ఆ యువకుడు అర్ధంతరంగా తనువు చాలించా డు. కారణం ఏంటనేది స్పష్టంగా తెలియనప్ప టికీ ఉద్యోగంకోసం వెళ్లిన కుమారుడు అకస్మా త్తుగా మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు తీ వ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబం ధించి వారు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురుకు చెందిన నేదూరి రామలక్ష్మి-సురేష్ దంపతుల కుమారుడు నేదూరి తారక ముత్యాలరాము(24) కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడు ఉపాధి నిమిత్తం కువైట్కు వెళ్లాల నుకుని కొమరాడకు చెందిన వలవల నాగరాజును సంప్రదించాడు. వీసా నిమిత్తం అత డికి రూ.85వేలు కూడా ఇచ్చాడు. గతేడాది డిసెంబరు 28న బయలుదేరి జనవరి 1న కువైట్లో అడుగుపెట్టాడు. అప్పటినుంచి నాగ రాజు వేధింపులు భరించలేకపోతున్నానని రాము పలుమార్లు తమకు ఫోన్లో చెప్పేవాడని, కొన్నిరోజులు పోతే వేధింపులు తగ్గుతాయని తమ కుమారుడికి నచ్చచెప్పినట్టు తల్లిదండ్రులు తెలిపారు. తమ యజమాని మంచివాడే కానీ తన సాటి డ్రైవర్గా చేస్తూ తనతోపాటే రూములో ఉండే నాగరాజు మాత్రం తనను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడని పలుమార్లు తమ దృష్టికి తెచ్చాడని వారు వాపోయారు. ఈనెల 13న గురువారం సాయంత్రం రాము కనిపించడం లేదని, ఎక్కడికో పారిపోయాడని కువైట్లోనే ఉంటున్న తమ బంధువులకు నాగరాజు ఫోన్ చేసి చెప్పాడన్నారు. అదేరోజు సాయంత్రం స్థానికంగా ఉన్న బీచ్ వద్ద పాడుపడిన బంగ్లాలో రాము ఉరివేసుకున్నాడని సమాచారం ఇచ్చాడన్నారు. దీంతో తమ బంధువులు కూడా సంఘటనా స్థలానికి వెళ్లి చూశారన్నారు. దీంతో వారు ఇండియన్ ఎంబసీ అధికారులు, మంత్రి నారా లోకేశ్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లడంతో ఈనెల 17వతేదీ సోమవారం మృతదేహం స్వగ్రామం వచ్చిందని రాము తల్లిదండ్రులు తెలిపారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడని కాదని, వీసా తీసిన వ్యక్తి వేధింపులకు పాల్పడడంవల్ల మరణించాడా లేక మరేమైనా జరిగిందా అన్న అనుమానంగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఈనెల 14న నగరం పోలీస్స్టేషన్లో, తహశీల్దార్ కార్యాలయంలోను, 15న కోనసీమ జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశామని మృతుడి తల్లిదండ్రులతోపాటు సోదరుడు ఫణీంద్రకుమార్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa