ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆశా వర్కర్లకి పెన్షనను నెలకు రూ.10వేలు చెల్లించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 11:24 AM

ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాసులు ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆ మేరకు మంగళవారం సబ్‌కలెక్టరేట్‌ ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా శ్రీనివా సులు మాట్లాడుతూ ఆశావర్కర్లకు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5లక్షలు, పెన్షనను నెలకు రూ.10వేలు చెల్లించాలన్నారు. 20ఏళ్లుగా పనిచేస్తున్న ఆశా వర్కర్ల వేతనాలను నిత్యావసర ధరలకు అనుగుణంగా పెంచాలన్నారు. ఏఎనఎం, ఎంఎల్‌ హెచపీలు చేసే పనులను ఆశా వర్కర్ల చేత చేయిస్తున్నారని, వారిపై పనిభారం తగ్గిం చాలన్నారు. ఆశావర్కర్‌ అసోసియేషన జిల్లా అధ్యక్షురాలు జయమ్మ మాట్లాడుతూ ఆశా వర్కర్ల వేతనాలను రూ.20వేలకు పెంచాలని, ఆశాలకు గ్రూప్‌ ఇన్సూరెన్స రూ.10 లక్షలు చేయాలని ప్రభుత్వ సెలవులతో పాటు, మెడికల్‌ లీవులు మంజూరు చేయాల న్నారు. ఆశాలు మరణిస్తే వారి కుటుంబీకులకు ఆశా వర్కర్‌ పోస్టు మంజూరు చేయా లన్నారు. అనంతరం డీఏవో రాఘవేంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో ఆశా వర్కర్‌ అసోసియేషన నాయకురాళ్లు రమామణి, హారిక, గాయత్రి, మంజుల, మల్లేశ్వరి, పుణ్యవతి, సుజాత, పార్వతి, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa