ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు దిగిన వ్యక్తి.. చెక్ చేసిన పోలీసులు షాక్..

Crime |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 11:20 PM

విజయవాడ రైల్వేస్టేషన్‌లో సందీప్ అనే వ్యక్తి నుంచి భారీగా వెండి ఆభరణాలను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి సందీప్ రైలు దిగాడు. అయితే రైల్వే పోలీసులు అతణ్ని తనిఖీ చేయగా.. భారీగా వెండి ఆభరణాలను గుర్తించారు. వీటిని ఆగ్రా నుంచి విజయవాడకు తీసుకువస్తున్నట్లు తెలిసింది. సుమారు 107 కిలోల వెండి ఆభరణాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే వీటికి బిల్లులు లేకపోవటంతో స్వాధీనం చేసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా చెకింగ్ చేశామన్న రైల్వే పోలీసులు.. ఈ సందర్భంగా బిల్లులు లేని సుమారు కోటి రూపాయల పైచిలుకు విలువ గల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సరైన పత్రాలు లేని కారణంగా వీటిని జీఎస్టీ అధికారులకు అప్పగించనున్నట్లు వివరించారు.


బంగారు గొలుసు దోపిడీ ఘటనను చిలకలూరిపేట పోలీసులు మూడు గంటల్లోనే ఛేదించారు. పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం.. తిమ్మాపురంలో జాతీయ రహదారి పక్కన కిరాణా కొట్టు నడిపే మల్లీశ్వరి మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు లాక్కె్ళ్లారు. కిరాణా దుకాణంలో కొనుగోలుచేసిన దుండగులు.. అదను చూసి చైన్ లాక్కెళ్లారు. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఫోన్‌పే చేసిన నంబర్ సాయంతో దొంగలు ఎక్కడ ఉన్నదీ గుర్తించారు. అనంతరం బోయపాలెం వద్ద చెకింగ్ చేపట్టగా.. నిందితులు ఇద్దరూ పారిపోవటానికి ప్రయత్నించారు. వారిని వెంబడించి పట్టుకున్న పోలీసులు.. వారి వద్ద నుంచి బంగారు గొలుసు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఉద్యోగం లేక ఇలా చెడు వ్యసనాల బాట పట్టినట్లు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa