ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగ్లాపై విజయంతో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ బోణీ

sports |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2025, 11:10 PM

గత కొన్ని రోజులుగా వన్డే క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కాడు. జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. తొలుత భారత బౌలర్లు రాణించడంతో బంగ్లాదేశ్.. 228 రన్స్‌కే ఆలౌట్ అయింది. శుభ్‌మ్ గిల్ సెంచరీతో భారత్.. 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీని విజయంతో ఆరంభించింది. శుభ్‌మన్ గిల్ ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’గా నిలిచాడు.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత బౌలర్ల దెబ్బకు ఓ దశలో 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్.. ఆ తర్వాత తౌహిద్ హ్రిదోయ్ (100), జాకిర్ అలీ (68) రాణించడంతో 49.4 ఓవర్లలో 228 రన్స్ చేసింది. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 5 వికెట్లతో సత్తా చాటాడు. హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీాడు.


అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 9.4 ఓవర్లలో 69 పరుగులు జోడించారు. ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ శర్మ 36 బంతుల్లో 41 రన్స్ చేసి తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (22) కాసేపు నిలబడ్డా.. భారీ స్కోరు చేయలేకపోయాడు. శ్రేయస్ అయ్యర్ (15), అక్షర్ పటేల్ (8) కూడా త్వరగానే ఔట్ కావడంతో భారత్ ఓ దశలో 144 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.


ఈ సమయంలో శుభ్‌మన్ గిల్‌కు జత కలిసిన కేఎల్ రాహుల్.. స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. చేయాల్సిన స్కోరు తక్కువగానే ఉండటంతో ఈ జోడీ ఆచితూచి బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే శుభ్‌మన్ గిల్ సెంచరీని కొట్టాడు. వన్డేల్లో 8వ సెంచరీ నమోదు చేశాడు. కాగా శుభ్‌మన్ గిల్‌కు ఇదే తొలి ఛాంపియన్స్ ట్రోఫీ కావడం గమనార్హం. ఈ టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అతడు మూడంకెల స్కోరు చేశాడు.


కేఎల్ రాహుల్ (47 బంతుల్లో 1రన్స్) కూడా రాణించడంతో భారత్.. 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాహుల్‌తో పాటు శుభ్‌మన్ గిల్ (101 నాటౌట్) కూడా అజేయంగా నిలిచాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుసేన్ 2, తస్కిన్ అహ్మద్ 1, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 1 వికెట్ తీశారు.


కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే గెలిచి.. పాయింట్ల ఖాతాను తెరిచింది. గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ +1.200 నెట్ రన్ రేట్‌తో తొలి స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ తక్కువగా ఉన్నందున భారత్ రెండోస్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో తన తర్వాతి మ్యాచులో టీమిండియా ఈనెల 23న పాకిస్థాన్‌తో తలపడనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa