ఎలాంటి పనీ పాట లేకుండా ఇంట్లో ఉత్తిగా తిని కూర్చునే వాళ్లను తిట్టేందుకు.. ఏంట్రా ఇంట్లో కూర్చుని ఈగలు ఊపుతున్నావా అంటూ అంటుంటాం. కానీ ఇలా చేయడం కూడా ఓ పనేనని, అందుకు డబ్బులు కూడా వస్తాయని చెబుతోంది ఓ దేశం. అయితే ఇక్కడ ఈగలకు బదులుగా దోమలు పట్టాలని, అలా చేస్తే డబ్బులు కూడా చెల్లిస్తామంటోంది. చనిపోయిన లేదా బతికున్న ఐదు దోమలను పట్టిస్తే.. రూపాయిన్నర (రూ.1.50) ఇస్తామని వివరిస్తోంది. మరి ఇలాంటి బంపరాఫర్ ప్రకటించిన దేశం ఏది, ఇందులు ఇలాంటి నిర్ణయం తీసుకుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా నగరానికి సమీపంలో ఉన్న అడిషన్ హిల్స్ పట్టణ గ్రామంలో లక్షకు పైగా జనాభా నివాసం ఉంటోంది. ఈ మధ్య కాలంలో అక్కడ దోమలు ఎక్కువ అయ్యాయట. ఈక్రమంలోనే అనేక మందికి డెంగీ, ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయట. వీటన్నిటికి దోమలే కారణం కాగా.. ఇటీవలే ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. అంతేకాకుండా ఫిబ్రవరి 1వ తేదీ వరకే 28 వేల 234 మంది డెంగీ బారిన పడ్డారు. దీంతో ఈ గ్రామస్థులు అంతా తెగ ఆందోళన చెందుతున్నారు.
కేసులు అంతకంతంకూ పెరగడం, మరణాలు కూడా మొదలు కావడంతో గ్రామ నాయకుడు ఓ అద్భుతమైన ప్లాన్ వేశాడు. తమ గ్రామంలోంచి దోమలను తరిమేసేందుకు ఓ వినూత్నమైన ప్రయోగం చేపట్టారు. ముఖ్యంగా గ్రామంలోని ప్రజలందరికీ.. బంపరాఫర్ ఇస్తూ దోమలు పట్టి తెచ్చిన వాళ్లకు డబ్బులు ఇస్తామని ప్రకటించారు. అయితే అవి బతికి ఉన్నా, చనిపోయినా ఫర్వాలేదని.. ఐదు దోమలకు గాను ఒక ఫిలిప్పీన్ పెసో (భారత కరెన్సీలో రూపాయిన్నర అంటే రూ.1.50) ఇస్తామని చెప్పారు.
దీంతో గ్రామస్థులతో పాటు ఇతర దేశాలు సైతం షాక్ అవుతున్నాయి. ఇదెక్కడి ఆఫర్ సామీ ఇంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. కానీ ఆ గ్రామస్థులు మాత్రం ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని దోమలు పట్టుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు దోమలను చంపడమే లక్ష్యంగా పెట్టుకుని.. ఇంటితో పాటు ఆవరణ, మురుగు కాలువలు, రోడ్లపై తిరుగుతున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధిన వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈక్రమంలోనే పలువురు మా గ్రామం కూడా ఇలాంటి ఆఫరిస్తే.. వేలు సంపాదించేవాడిని నేనంటూ ఓ నెటిజెన్ చెప్పుకొచ్చాడు. దోమల బ్యాట్తోనే క్రికెట్ ఆడుతూ.. పాకెట్ మనీ సంపాదించుకునేవారిమంటూ మరికొంత మంది తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మరి ఈ ఆఫర్ వింటే మీకేమనిపిస్తుందో కామెంట్ల రూపంలో చెప్పేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa