ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ కీలక ఆటగాడు,,,,భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు బిగ్ బిగ్ షాక్.

sports |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2025, 11:12 PM

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తన తొలి మ్యాచ్‌లోనే ఓడిపోయి.. నిరాశలో ఉన్న పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లు ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఫకర్ జమాన్.. టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా సోషల్ మీడియా పోస్టు ద్వారా చెప్పాడు. కీలకమైన భారత్‌తో మ్యాచ్‌కు ముందు ఫకర్ జమాన్ దూరమవడం పాకిస్థాన్‌కు పెద్ద ఎదురుదెబ్బే.


ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్‌తో తలపడింది. ఈ మ్యాచ్ టాస్ గెలిచిన పాక్.. తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే, మ్యాచ్ ప్రారంభమైన రెండో బంతికే కివీస్ బ్యాటర్ కొట్టిన షాట్‌ను ఆపేందుకు ఫకర్ జమాన్ ప్రయత్నించాడు. బౌండ‌రీ లైన్ వ‌ద్ద బంతిని ఆప‌బోయిన ఫకర్.. కింద‌ప‌డి గాయ‌ప‌డ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడు కాసేపు మైదానంలో కనిపించలేదు.


బ్యాటింగ్‌లోనూ ఓపెనర్‌గా కాకుండా సెకండ్ డౌన్‌లో క్రీజులోకి వచ్చాడు. జట్టు కష్టాల్లో ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చాడు. 41 బంతుల్లో 24 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో అత‌డు తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడు టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని అతడే వెల్లడించాడు.


పాకిస్థాన్ జట్టు ఈ నెల 23న భారత్‌తో తలపడనుంది. ఇప్పటికే టోర్నీలో ఒక మ్యాచ్ ఓడిపోయి సెమీఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పాక్.. మరో మ్యాచ్‌ ఓడితే, టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే.


ఫకర్ జమాన్‌కు భారత్‌పై మెరుగైన రికార్డు ఉంది. భారత్‌తో ఆరు వన్డే మ్యాచ్‌లు ఆడిన అతడు.. 46.80 సగటుతో 34 పరుగులు చేశాడు. 82.39 స్ట్రైక్ రేట్‌తో ఈ రన్స్ చేశాడు. ముఖ్యంగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ చేసి.. భారత జట్టుకు టైటిల్‌ను దూరం చేశాడు.


ఇక ఫకర్ జమాన్ స్థానంలో ఉమామ్ ఉల్ హక్ పాకిస్థాన్ జట్టులోకి వచ్చాడు. ఈ విషయాన్ని ఐసీసీ ప్రకటించింది. 29 ఏళ్ల ఇమామ్ 2023 నుంచి పాకిస్థాన్ తరఫున ఆడలేదు. చివరిసారిగా భారత్ వేదికగా జరిగిన 2023లో జరిగిన ప్రపంచకప్‌లో వన్డే మ్యాచ్ ఆడాడు. మొత్తంగా 72 వన్డేలు ఆడిన అతడు.. 48.27 సగటుతో 3138 పరుగులు చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa