ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిర్చి రైతుకు నష్టాల ఘాటు.. ధరల పతనానికి కారణం ఏంటి?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 01:18 PM

ఈ ఏడాది మిర్చి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులకు ఎకరాకు సగటున రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు నష్టాలు వస్తున్నాయి. గతేడాది రూ.20 వేల వరకు పలికిన క్వింటాల్ మిర్చి ధర ఈ ఏడాది రూ.8 వేలకు నుంచి రూ.13 వేలకు మించడం లేదు.
ఇప్పటికే కోల్డ్‌ స్టోరేజిల్లో గతేడాది పంట 15 లక్షల బస్తాలు నిల్వ ఉంది. ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. కొత్త పంటకు ఎగుమతులకు ఆర్డర్లు లేకపోవడంతో ధరల పతనం ప్రారంభమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa