ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు అసెంబ్లీ లోకి అడుగుపెట్టనున్న వైఎస్సార్‌సీపీ నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2025, 10:18 AM

ఈ రోజు అసెంబ్లీకి హాజరు కావాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. గవర్నర్ ప్రసంగం కావడంతో ఈ రోజు సభకు రావాలని నిర్ణయించినట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేసి తదనంతర కార్యాచరణ ప్రణాళిక నిర్ణయించాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. కాగా మంగళ, బుధవారం కడప జిల్లాలో జగన్ పర్యటించనున్నారు. ఏ సభ్యుడైనా సభకు 60 రోజులు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుందనే భయంతోనే వస్తున్నారని కూటమి నేతల నుండి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa