ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగుల జీతాల సమస్య త్వరలోనే పరిష్కరిస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2025, 10:24 AM

రాజకీయ ప్రయోజనాలకు కాకుండా దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చి కేంద్ర బడ్జెట్‌లో కీలక రంగాలకు కేటాయింపులు చేశామని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ అన్నారు. రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖలో నిర్వహించిన మేధావుల సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి పనులకు భారీగా నిధులు మంజూరు చేశామన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల సమ్మె నోటీసుపై వారితో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ప్లాంట్‌కు ప్యాకేజీ ప్రకటించాక మంచి ఫలితాలు వస్తున్నాయని, గతంలో ఆగిన రెండు బ్లాస్ట్‌ ఫర్నే స్‌లు ఇప్పుడు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయని.. జూన్‌ నాటికి మూడో బ్లాస్ట్‌ ఫర్నే్‌సలో ఉత్పత్తి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఉద్యోగుల జీతాల సమస్య మరి కొద్ది రోజుల్లో పరిష్కారమవుతుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa