ఉత్తర ప్రదేశ్లోని హర్దోయ్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రైవేటు బడిలో హర్షిత్ తివారీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అయితే స్థానికంగా నివాసం ఉండే ఓ పదేళ్ల బాలుడు.. ఆ పాఠశాలలోనే మూడో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే శనివారం రోజు కూడా విద్యార్థి హుషారుగా బడికి వచ్చాడు. ఈక్రమంలోనే హర్షిత్ తివారీ మూడో తరగతి పిల్లలకు పాఠం చెప్పాడు. ఆపై పలు ప్రశ్నలు అడిగాడు. ఈక్రమంలోనే పదేళ్ల బాలుడి ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన టీచర్ బాలుడిని దగ్గరకు రమ్మని పిలిచాడు.
ఆపై కర్తతో ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు. కులం పేరుతో దూషిస్తూ.. నీకసలు చదువే రాదంటూ రచ్చ చేశాడు. అంతటితో వదిలేయకుండా బెంచీపై నిల్చోమని, గోడ కుర్చీ వేయమంటూ పలు శిక్షలు విధించాడు. అయినా అతడి కోపం తగ్గకపోవడంతో.. బాలుడిని వంగోమని చెప్పి అతడి వీపుపై కూర్చునే ప్రయత్నం చేశాడు. ఈక్రమలంనే విద్యార్థి అదుపుతప్పి కింద పడిపోయాడు. దీంతో అతడి కాలు విరిగిపోయింది. నొప్పితో బాలుడు విలవిల్లాడగా.. గుర్తించిన కొందరు ఉపాధ్యాయుడు అతడిని ఇంటికి పంపించారు.
ఇంటికి వెళ్లిన బాలుడు వెంటనే తల్లిదండ్రులకు విషయం చెప్పగా.. ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాబుకు కాలు విరిగిందని వివరించారు. అలాగే వినికిడి సమస్య కూడా వచ్చిందని చెప్పారు. ఆపై చిన్నారిని తీసుకుని నేరుగా తల్లిదండ్రులు బడికి వెళ్లారు. చిన్న సమాధానం చెప్పకపోతే ఇంత దారుణంగా మీరెలా కొడతారంటూ ఉపాధ్యాయుడు హర్షిత్ తివారీతో గొడవకు దిగారు. దీంతో భయపడిపోయిన ఆ ఉపాధ్యాయుడు 200 రూపాయలు తీసి వాళ్లకు ఇచ్చాడు. ఆ డబ్బులతోనే అతడికి కట్టు కట్టించమని వివరించాడు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉపాధ్యాయుడు హర్షిత్ తివారీని అరెస్ట్ చేశారు. అలాగే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa