ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో కనిపించి వైరల్ అయిన ఐఐటీ బాబా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువుకని.. బాబాగా మారిన ఈయన భక్తులకు అనేక సందేశాలు ఇస్తూ కనిపించారు. అయితే ఇటీవలే ఆయన పాకిస్థాన్తో భారత్ ఆడే మ్యాచ్లో ఇండియా అస్సలే గెలవదని జోస్యం చెప్పారు. నేను చెబుతున్నాను కాబట్టి గెలిచే ఛాన్సే లేదంటూ వివరించారు. కానీ ఆ మ్యాచ్లో భారత్ గెలవడంతో ఐఐటీ బాబాపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. అయితే తాజాగా ఈయన తన జోస్యంపై స్పందించారు. ఆ పూర్తి వివిరాలు మీకోసం.
హర్యానాకు చెందిన అభయ్ సింగ్ ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువుకున్నారు. ఆపై క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఉద్యోగం సంపాదించాడు. ఇలా కొన్నేళ్ల పాటు పలు కంపెనీల్లో పని చేసిన లక్షల సంపాదించిన ఈయన ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆ తర్వాత ట్రావెల్ ఫొటోగ్రఫీలో కోర్సు చేసి ఆపై దీన్ని కూడా వదిలేశాడు. చివరకు ఓ కోచింగ్ సెంటర్ పెట్టి ఫిజిక్స్ సబ్జెక్టులో విద్యార్థులకు కోచింగ్ ఇచ్చాడు. కానీ అందులో కూడా ఆయన ఎక్కుల రోజులు ఇమడలేక.. ఆధ్యాత్మికత వైపు మళ్లాడు. ప్రస్తుతం ఐఐటీ బాబాగా మారి శివనామ స్మరణ చేస్తున్నారు.
అయితే శివ భక్తుడు అయిన ఈయన ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు వచ్చి వైరల్ అయ్యాడు. అక్కడకు వచ్చే భక్తులకు జ్ఞానోపదేశం చేస్తూనే.. ఇంగ్లీషులో మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా తన చదువు గురించి అందరికీ షాకిచ్చాడు. ఆ తర్వాత పలు వివాదాల్లోనూ చిక్కుకున్న ఈయన తాజాగా.. భారత్-పాకిస్థాన్ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్పై జోస్యం చెప్పాడు. అందులో ఇండియా అస్సలే గెలవదని.. విరాట్ కోహ్లీ సహా ఈ విషయం అందరికీ చెప్పమంటూ వివరించారు. ఇండియా గెలవదని నేను చెబుతున్నానంటే భారత్ గెలవదంతేనని స్పష్టం చేశారు.
కానీ ఆదివారం రోజు జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఆల్ రౌండ్ షోతో పాక్ను 6 వికెట్ల తేడాతో ఓడించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. దీంతో ఐఐటీ బాబాపై క్రికెట్ లవర్లంతా ట్రోల్స్ చేశారు. ఇక జోస్యం చెప్పడం ఆపేయమంటూ వివరించారు. మరోసారి ఇలాంటివి చెబితే అస్సలే ఊరుకోమంటూ వెల్లడించారు. అయితే తాజాగా దీనిపై ఐఐటీ బాబా స్పందించారు.
ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. నేను బహిరంగంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నానని ఐఐటీ బాబా వివరించారు. ఇది పార్టీ టైం అని కాబట్టి ప్రతీ ఒక్కరూ సంబురాలు చేసుకోవాలన్నారు. భారత్ గెలవదని చెప్పాను కానీ.. గెలుస్తుందని నా మనసుకు తెలసంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓసారి చూసేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa