ఉత్తర ప్రదేశ్లోని హసన్పూర్కు చెందిన అస్మాకు మూడేళ్ల క్రితమే నూర్ మహ్మద్తో వివాహం జరిగింది. అయితే కొన్నాళ్లు హాయిగానే సాగిన వీరి కాపురంలో మనస్పర్థలు వచ్చాయి. చాలా సార్లు నచ్చజెప్పుకుని కాపురాన్ని కొనసాగించినా తరుచూ గొడవలు రావడంతో.. అస్మా ఆరు నెలల క్రితమే పుట్టింటికి వచ్చేసింది. వెంటనే అతడితో విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు కూడా చేసుకుంది. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో పెండింగ్లో ఉండగా.. తాను పుట్టింటి వాళ్లకు బారం కావొద్దని అనుకుంది. ముఖ్యంగా గేదెలు కొనుగోలు చేసి వాటి ద్వారా వచ్చే పాలు అమ్ముకుంటూ స్వతంత్రంగా జీవించాలని భావించింది. కానీ తన వద్ద డబ్బులు లేక అలాగే ఉండిపోయింది.
ఇదంతా ఇలా ఉండగా ఉత్తర ప్రదేశ్ సర్కారు సామూహిక వివాహాలు జరిపిస్తోంది. ఆర్థికంగా బలంగా లేని జంటలకు పెళ్లిళ్లు చేసి వధువుకు 35 వేల రూపాయల ఆర్థిక సాయంతో వధూవరులకు రెండు జతల బట్టలు, గోడ గడియారం, వ్యానిటీ కిట్, దుపట్టా, వెండి కాలి మెట్టలు అందేజేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న అస్మా.. రెండో పెళ్లి చేసుకుంటే వచ్చే డబ్బులతో గేదెలు కొనుగోలు చేయొచ్చని భావించింది. వెంటనే తన బంధువ అయిన జాబర్ అహ్మద్కు ఫోన్ చేసి ఈ ప్లాన్ గురించి చెప్పింది.
తనను పెళ్లి చేసుకుంటే వచ్చే డబ్బు, బహుమతులు చెరిసగం పంచుకుని గేదెలు కొనుగోలు చేద్దామని చెప్పింది. అతడు కూడా ఇందుకు ఒప్పుకోగా ఇద్దరూ పెళ్లికి రెడీ అయిపోయారు. ముందుగానే సామూహిక వివాహ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈక్రమంలోనే ఆదివారం రోజు యూపీ ప్రభుత్వం ఈ వివాహాలను జరిపించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. దీంతో అస్మా, జాబర్ అహ్మద్లు అందరిలాగే పెళ్లి బట్టలు ధరించి అందంగా ముస్తాబై వచ్చి పీటల మీద కూర్చున్నారు.
ఇంకాసేపట్లోనే అతడు తాళి కడతాడనగా.. అస్మా అత్తింటి వాళ్లు అక్కడకు వచ్చారు. సినిమా స్టైల్లో పెళ్లి ఆపమంటూ కేకలు వేశారు. దీంతో అవాక్కైన అధికారులు ఏమైందనగా.. అస్మాకు గతంలోనే పెళ్లి జరిగిందని.. డబ్బుల కోసమే ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందని తెలిపారు. దీంతో షాకైన అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు వధూవరిలిద్దరిపై కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa