టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్తాన్పై విజయం అనంతరం ఫుల్ జోష్లో ఉన్నాడు. భారత జట్టు సెమీస్లో అడుగుపెట్టడం, పాకిస్తాన్తో మ్యాచ్ తర్వాత మరో మ్యాచ్కి టైమ్ దొరకడంతో ఫ్యామిలీతో సరదగా గడిపాడు. రోహిత్ శర్మ తన కూతురితో కలిసి సరాదాగా ఉన్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటో చూసిన నెటిజన్లు సో క్యూట్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
ఫిబ్రవరి 23న జరిగిన భారత్-పాక్ మ్యాచ్ వీక్షించేందుకు రోహిత్ శర్మ ఫ్యామిలీ దుబాయ్ చేరుకుంది. రోహిత్ భార్య రితిక, కూతురు సమైరా భారత్-పాక్ మ్యాచ్ని చూశారు. ఆ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ తన ఫ్యామిలీకి టైమ్ కేటాయించాడు. కూతురు సమైరాతో కలిసి అలా బయటకు వచ్చాడు. ఒక బొమ్మ వద్ద కూర్చొని చేతులు చాపి ఇద్దరూ కలిసి ఫొటోకి పోజిచ్చారు. కూతురంటే రోహిత్ శర్మకి చాలా ఇష్టం. అందుకే ఎక్కువగా సమైరాతో టైమ్ స్పెండ్ చేస్తూ క్రికెట్ ఒత్తిడి నుంచి రిలీఫ్ అవుతూ ఉంటాడు.
బీసీసీఐ రూల్స్ ప్రకారం ఇలాంటి టూర్స్కి వచ్చినప్పుడు ఫ్యామిలీని అస్సలు తీసుకొని రాకూడదు. అయితే టీమిండియా ప్లేయర్ల రిక్వెస్ట్ మేరకు బీసీసీఐ నిబంధనను సడలించింది. కేవలం ఒక్క మ్యాచ్కి మాత్రమే ఫ్యామిలీని తీసుకురావొచ్చంటూ కండీషన్ పెట్టింది. దాంతో రోహిత్ శర్మ ఫ్యామిలీ భారత్-పాక్ మ్యాచ్ చూసేందుకు వచ్చారు. న్యూజిలాండ్తో టీమిండియా మార్చి 2న తలపడనుండటం, ఆ మ్యాచ్కి చాలా సమయం ఉండటంతో రోహిత్ ఇలా చిల్ అవుతూ కనిపించాడు.
రోహిత్ శర్మ, రితికా 2015వ సంవత్సరం డిసెంబర్ 13న వివాహం చేసుకున్నారు. స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్న రితికాతో ప్రేమలో పడిన రోహిత్ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి 2018లో కూతురు సమైరా జన్మించింది. 2024 నవంబర్లో ఆహాన్ అనే బాబుకు జన్మనిచ్చారు. రోహిత్ ఖాళీ దొరికనప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్స్కు వెళ్తంటాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa