ఇటీవలే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకు హత్య బెదిరింపులు వచ్చాయి. ఆయన కారును బాంబుతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు ఫోన్ చేయగా.. అప్రమత్తమై చర్యలు చేపట్టారు. ఈ ఘటన జరిగిన వారం రోజులకే నేరుగా ముఖ్యమంత్రినే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఏకంగా పాకిస్థాన్ నుంచి ఓ వ్యక్తి సీఎం కార్యాలయం సహా పలు ప్రభుత్వ భవనాలను బాంబులు పెట్టి పేల్చేస్తామంటూ వివరించగా.. పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపడుతూనే.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఫిబ్రవరి 20వ తేదీ గురువారం రోజు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ చేశాడు. ముంబయిలోని గోరెగావ్ పోలీసులకు మధ్యాహ్నం పూట ఈ మెయిల్ రాగా.. ఆయన కారులో బాంబు పెట్టామని వివరించారు. కాసేపట్లోనే దాన్ని పేల్చబోతున్నట్లు వెల్లడించారు. ఈ ఒక్క స్టేషన్కే కాకుండా జేజే మార్గ్ పోలీస్ స్టేషన్, రాష్ట్ర సచివాలయానికి కూడా ఇదే మెయిల్ పంపారు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు డిప్యూటీ సీఎం ఎక్కుడన్నారో తెలుసుకని మరీ పరుగులు పెట్టారు. ఆయనకు అసలు విషయాన్ని చెప్పి.. కారులో తనిఖీలు చేపట్టారు. అయితే ఇదో బూటకపు బెదిరింపు అని గుర్తించిన పోలీసులు నిందితుడిని మాత్రం పట్టుకోలేకపోయారు. అయితే తాజాగా మరో బెదిరింపు వచ్చింది. అయితే ఈసారి ఏకంగా మాహరాష్ట్ర ముఖ్యమంత్రినే టార్గెట్ చేసుకున్నారు.
పాకిస్థాన్కు సంబంధించిన ఓ ఫోన్ నెంబర్ నుంచి శుక్రవారం రోజు ఉదయం.. ముంబయి ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్లో బెదిరింపు మెసేజ్ వచ్చింది. అయితే అందులో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఈ మెసేజ్ చేసిన వ్యక్తి పేరు మాలిక్ షాబాజ్ హుమయూన్ రాజాదేవ్గా చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సీఎం కార్యాలయంతో పాటు.. దేవేంద్ర ఫడ్నవీస్కు సంబంధించిన ప్రత్యేక కార్యాలయం, ప్రభుత్వ భవనాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa