ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుప్పకూలిన మంచు కొండ, 47 మంది గల్లంతు

national |  Suryaa Desk  | Published : Fri, Feb 28, 2025, 08:17 PM

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చమోలీ జిల్లాలో మంచు కొండ కుప్పకూలింది. ఈ ఘటనలో 57 మంది కార్మికులు ఆ మంచు కొండ కింద చిక్కుకుపోయారు. అందులో 10 మంది కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. మరో 47 మంది కార్మికుల ఆచూకీ గల్లంతైంది. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది.. ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. చమోలీ జిల్లాలోని చమోలీ-బద్రీనాథ్ జాతీయ రహదారిపై మన గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.


రోడ్డు నిర్మాణ కార్మికులు తమ పనిలో నిమగ్నం కాగా.. ఒక్కసారిగా మంచుకొండ విరిగిపడింది. దీంతో మంచు శిథిలాల కింద.. కార్మికులు అంతా చిక్కుకుపోయారు. ప్రమాద సమాచారం తెలియగానే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్-ఎస్‌డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్-ఎన్‌డీఆర్ఎఫ్, చమోలీ జిల్లా అధికార యంత్రాంగం, ఇండో-టిబెటన్ బోర్డర్ ఫోర్స్-ఐటీబీపీ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్-బీఆర్ఓ బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగి.. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి.


ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాలకు.. భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం రాత్రి వరకు 20 సెంటీమీటర్లకుపైగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ భారీ వర్షాలకు రోడ్లపై వరద సంభవిస్తుందని.. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయని అంచనా వేసింది. మరీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అండర్‌పాస్‌లను మూసివేయాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa