ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బంపరాఫర్.. రూ. 1385 కే విమాన ప్రయాణం

business |  Suryaa Desk  | Published : Fri, Feb 28, 2025, 11:09 PM

విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి శుభవార్త. దేశంలోని దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ తీపికబురు అందించింది. మరో కొత్త సేల్ లాంఛ్ చేసింది. ఎయిరిండయా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ ఇప్పుడు పేడే సేల్ తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా లైట్  ఆఫర్ కింద ఎక్స్‌ప్రెస్ లైట్ ఫేర్స్ రూ. 1385 నుంచే ప్రారంభం అవుతున్నాయి. ఇదే సమయంలో వాల్యూ ఆఫర్ కింద ఎక్స్‌ప్రెస్ వాల్యూ ఫేర్స్ రూ. 1535 నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఇక ఈ బుకింగ్స్ చేసుకునేందుకు 2025, మార్చి 2 లాస్ట్ డేట్‌గా ఉంది. అంటే ఆలోగా టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఆఫర్ 2025 సెప్టెంబర్ 19 వరకు వర్తిస్తుంది. అంటే మార్చి 1 నుంచి సెప్టెంబర్ 19 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేసే వీలుంటుంది.


ఈ ఆఫర్లో ప్రకటించిన ధరలోనే బేస్ ఫేర్, టాక్స్‌లు, ఎయిర్‌పోర్ట్ ఛార్జీలు ఉంటాయి. కన్వీనియన్స్ రుసుములు, ఇతర అనుబంధ ఛార్జీలు వేరేగా ఉంటాయి. అయితే ఇక్కడ ఈ ఛార్జీల్ని కూడా తప్పించుకోవచ్చు. ఎక్స్‌ప్రెస్ లైట్ ఫేర్స్‌పై ఎయిరిండియా‌ఎక్స్‌ప్రెస్.కామ్ వెబ్‌సైట్ లేదా ఎయిర్‌లైన్స్ మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్నట్లయితే అప్పుడు జీరో కన్వినియన్స్ ఫీజు వర్తిస్తుంది.


ఈ లైట్ ఆఫర్ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ అఫీషియల్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా లాగిన్ అయిన లోయల్టీ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. అంటే లాగినై టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ అయిన సభ్యులు ఇతర బెనిఫిట్స్ కూడా అందుకోవచ్చు. ప్రైమ్ అండ్ స్టాండర్డ్ సీట్స్‌లో 25 శాతం తగ్గింపు, బిజ్ సీట్ అప్‌గ్రేడ్స్‌లో 50 శాతం తగ్గింపు పొందొచ్చు. 10 కేజీ ఎక్సెస్ చెకిన్ బ్యాగేజీపై 25 శాతం తగ్గింపు ఇలా చాలానే ప్రయోజనాలు ఉన్నాయి. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


మరోవైపు వియత్నాంకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ వియత్‌జెట్ హోలీ పండగకు ముందు స్పెషల్ సేల్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. హనోయ్ ప్రధాన కేంద్రంగా నడిచే ఈ విమానయాన సంస్థ కేవలం రూ. 11 ప్రారంభ ధరతోనే విమాన టికెట్లు అందిస్తోంది. రూ. 11కుపైన టాక్సులు, ఇతర రుసుములు వర్తిస్తాయని అధికారిక వెబ్‌సైట్లో స్పష్టం చేసింది. ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్, కొచ్చి, ముంబై నుంచి ప్రయాణం చేయొచ్చు. ఫిబ్రవరి 21న ఈ ఆఫర్ ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 28 లాస్ట్ డేట్. మార్చి 10 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com