ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ దగాలపై ప్రజలు ప్రశ్నించేందుకు సిద్దంగా ఉన్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 01, 2025, 01:22 PM

ఎన్నికల హామీల అమలుకు బడ్జెట్ లో కేటాయింపులు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను పచ్చిగా మోసం చేసిందని వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోతే కాలర్ పట్టుకుని ప్రశ్నించాలన్న నారా లోకేష్ మంత్రిగా తన పోలీస్ భద్రతను పక్కకు పెట్టి ప్రజల్లోకి రాగలరా అని సవాల్ చేశారు. కూటమి ప్రభుత్వ దగాలపై ప్రజలు లోకేష్ కాలర్ పట్టుకుని ప్రశ్నించేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. అయన మాట్లాడుతూ.... రాష్ట్రంలోని ప్రజలు బడ్జెట్ లో తమ ఆకాంక్షలకు అనుగుణంగా కేటాయింపులు ఉంటాయని ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తామో చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు బడ్జెట్ లో వారు చేసిన కేటాయింపులే వారి మోసాన్ని బయటపెట్టాయి. కడపజిల్లాలో సుమారు రూ. రెండు నుంచి మూడు వేల కోట్లతో జీఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్, దానితో లింక్ ఉన్న హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ కు రూ.అయిదు వేల కోట్లు అవసరం. గత తొమ్మిది నెలల నుంచి ఒక్క పైసా విలువైన పనులు కూడా ఈ రెండు ప్రాజెక్ట్ ల్లో జరగడం లేదు. కడప ఉక్కు...మా హక్కు అని ఆనాడు మేం పోరాటం చేశాం. వైయస్ జగన్ గారి హయాంలో జిందాల్ ను తీసుకువచ్చి, ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు ప్రయత్నిస్తే, ఇప్పుడు దానిని కూడా అడ్డుకున్నారు. ఈ రాష్ట్రంలో కీలకమైన వైద్యవిద్యను ఆనాడు వైయస్ జగన్ గారు ప్రోత్సహిస్తూ 750 కొత్త మెడికల్ సీట్లను సాధిస్తే, చంద్రబాబు ఇప్పుడు వాటిని మాకు అవసరం లేదంటూ లేఖ రాయడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa