ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చంద్రబాబు మార్క్ వంచన, మోసానికి ప్రతిబింబంగా ఉందని, ప్రభుత్వంపై ఆధారపడిన పేద బలహీనవర్గాల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈ బడ్జెట్ కనిపించడం లేదని విశాఖ జిల్లా వైయస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. ఏపీ అంటే అమరావతే అన్నట్టు బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించి, రాష్ట్రంలో వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. సూపర్ సిక్స్ హామీల్లోని ఫ్రీబస్, ఆడ బిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి పథకాలను పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటాయించడం ద్వారా, వాటి అమలుపైనా అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు 9 నెలల పాలనపై ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మొదలైందని, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa