ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒంగోలులో విచారణకి హాజరుకాని సునీల్‌ నాయక్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 02:35 PM

నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి  రఘురామకృష్ణంరాజు  కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో అప్పటి సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్‌ నాయక్‌  ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకాలేదు. విచారణకు హాజరు కాకపోవడంపై కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. సోమవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సునీల్ కుమార్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.రఘురామపై కస్టోడియల్ టార్చర్ జరిగిన సమయంలో సునీల్ కుమార్ నాయక్ అక్కడే ఉన్నారని గుర్తించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీలో డీఐజీగా సునీల్ కుమార్ నాయక్ పని చేశారు. ప్రస్తుతం ఆయన బిహార్‌లో ఫైర్ సర్వీసెస్ డీఐజీగా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa