ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు కలిపి 164 సీట్లు రాగా.. వైఎస్సార్సీపీ 11 సీట్లకు పరిమితం అయ్యింది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి తర్వాత అసెంబ్లీలో అధికార, విపక్ష పార్టీల సభ్యులకు స్పీకర్ సీట్లు కేటాయింపు చేస్తారు. అయితే కూటమి ప్రభుత్వం జూన్ నెలలో అధికారంలోకి రాగా.. తొమ్మిది నెలల తర్వాత సీట్లు కేటాయించారు. ఈ మేరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో సభ్యులకు సీట్లు కేటాయించినట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ప్రకటన చేశారు.
అసెంబ్లీలో ట్రెజరీ బెంచ్గా ముందు వరుసలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( సీట్ నంబర్ 1), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (సీట్ నంబర్ 39), మిగిలిన మంత్రులకు సీట్లను కేటాయించినట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామ తెలిపారు. అనంతరం ప్రభుత్వం చీఫ్ విప్, విప్లకు సీట్లను కేటాయించామని.. అనంతరం సీనియారిటీ ప్రాతిపదికన ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించినట్లు తెలిపారు. అలగే మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ శాసనసభాపక్షనేత జగన్కు ప్రతిపక్ష బెంచీలో ముంద వరుసలో సీట్ కేటాయించినట్లు రఘురామ ప్రకటించారు. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించిన సమయంలో సభలోని సీనియర్ సభ్యులు కొందరు ఇప్పటి వరకు సీట్లు కేటాయించకపోవడంపై చర్చించారు.. దీంతో తాజాగా సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈగల్పై హోంమంత్రి కీలక ప్రకటన
రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో గంజాయి విచ్చలవిడి అయ్యిందన్నారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయి, డ్రగ్స్ను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలపై సభ్యులు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 'రాష్ట్రంలో గంజాయి నిర్మూలన కోసమే ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశాము. ఐజీ స్థాయి ఐపీఎస్ అధికారిని విభాగాధిపతిగా నియమించి.. ఈగల్కు బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున 26 నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేశాము' అని కీలక ప్రకటన చేశారు హోంమంత్రి వంగలపూడి అనిత.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa