ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతీ 4 సెకండ్లకు ఓ మద్యం బాటిల్ సీజ్

national |  Suryaa Desk  | Published : Tue, Mar 04, 2025, 07:34 PM

అక్రమంగా మద్యం తరలిస్తున్నా, ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయాలు జరుపుతున్నా పోలీసులు చర్యలు తీసుకుంటారు. వ్యాపారులను అరెస్ట్ చేస్తూనే మద్యం సీసాలను సీజ్ చేస్తుంటారు. ఇదంతా మనకు తెలిసిందే కాగా.. డ్రై సిటీలోనూ ఇలాంటి చర్యలు చేపట్టాల్సి వస్తోంది. ముఖ్యంగా ఎవరూ ఊహించని స్థాయిలో అక్కడం మద్యం బాటిళ్లు పట్టుబడుతున్నాయి. ప్రతీ 4 సెకండ్లకు ఓ సీసాను పోలీసులు సీజ్ చేస్తుండగా.. ఇప్పటి వరకు 82 లక్షల మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. మరి ఇంత పెద్ద మొత్తంలో మద్యం సీసాలను సీజ్ చేస్తూ మందుబాబుల కడుపు మాడుస్తున్న ఆ ప్రాంతం ఏదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


1960వ సంవత్సరం మే 1వ తేదీన మహారాష్ట్ర నుంచి వేరు పడి స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడ్డ గుజరాత్.. తొలిరోజు నుంచే అక్కడ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తోంది. దాదాపుగా 85 సంవత్సరాలు గుజరాత్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉండగా.. ఈమధ్య ఎక్కువగా మద్యం పట్టుబుడోతంది. ముఖ్యంగా 2024వ సంవత్సరంలో ప్రతీ నాలుగు సెకన్లకు ఒక మద్యం సీసాను సీజ్ చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. అంతేకాకుండా భారత దేశంలో తయారు చేస్తున్న విదేశీ మద్యం సీసాలే ఎక్కువగా పట్టుబడుతున్నట్లు వివరించారు.


గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు 82 లక్షల మద్యం సీసాలను పట్టుకోగా.. వీటి విలువు రూ.144 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. వీటిలో అహ్మదాబాద్ అర్బన్, రూరల్, పరిధిలోనే 4 లక్షల 38 వేల 47 మద్యం సీసాలు పట్టుబడ్డాయని పేర్కొన్నారు. అహ్మదాబాద్ నగరంలోనే 3.06 లక్షల ఐఎమ్ఎఫ్ఎల్ బాటిళ్లకు సంబంధించి 2 వేల 139 కేసులు నమోదు చేశామన్నారు. అలాగే 1.58 లక్షల లీటర్ల దేశీయ మద్యానికి సంబంధించిన 7 వేల 796 కేసులు నమోదు అయ్యాయని చెప్పుకొచ్చారు.


పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ వెలుగులోకి రాని కేసులు మరెన్నో ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వడోదర గ్రామీణ ప్రాంతంలోనే రహస్య గోడౌన్లు, కంటైనర్లు, కంపార్ట్‌మెంట్లలో దాచిన రూ.9.8 కోట్ల విలువైన ఐఎంఎఫ్ఎల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సూరత్ గ్రామీణ ప్రాంతంలో.. గృహోపకరణాల రూపంలో దాచిన రూ.8.9 కోట్ల విలువైన ఐఎంఎఫ్ఎల్ సూసాలు, హైటెక్ తయారీ యూనిట్లకు చెందిన 6.23 లక్షల ఐఎంఎఫ్ఎల్ బాటిళ్లను పట్టుకున్నారు. గోద్రాలో రూ.8.8 కోట్లు విలువైన మద్యాన్ని సీజ్ చేశారు.


ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వచ్చే మద్యాన్ని పట్టుకోవడమే కాకుండా.. రాష్ట్రంలో తయారు చేస్తున్న మద్యంపై కూడా కన్నేయాలని ఓ పోలీసు అధికారి వివరించారు. గుట్టు చప్పుడు కాకుండా అనేక మంది రాష్ట్రంలోనే మద్యం తయారీ చేస్తున్నారని వెల్లడించారు. వాటిపై కూడా చర్యలు తీసుకుంటామని.. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలయ్యేలా చూస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa