దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఓ ఎక్స్ప్రెస్ రైలు ఒడిశాలోని పూరీకి వెళ్తోంది. అయితే సోమవారం రోజే ఈ రైలు అక్కడి నుంచి బయలు దేరగా మార్గమధ్యంలో ప్రమాదం సంభవించింది. పట్టాలపై పరుగులు పెడుతుండగానే రైలు ఒక్కసారిగా రెండు భాగాలుగా విడిపోయింది. దీంతో ప్రయాణికులు అంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం చేయాలో పాలుపోక ప్రాణ భయంతో కేకలు వేయడం ప్రారంభించారు. విషయం గుర్తించిన అధికారులు రైలును ఆపేసి ఎలాంటి ప్రమాదం జరక్కుండా చూసుకున్నారు. అదృష్ట వశాత్తు ప్రయాణికులకు కూడా ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ పూర్తి వివరాలు మీకోసం.
దేశ రాజధాని ఢిల్లీ నుంచి నందన్ కానన్ ఎక్స్ప్రెస్ ఒడిశాలోని పూరికి బయలుదేరింది. సోమవారం రోజు ప్రారంభమైన ఈ రైలు ఉత్తర ప్రదేశ్లోని చందౌలీలో గల పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ సమీపానికి రాగానే రెండు భాగాలుగా విడిపోయింది. రైలు పట్టాలపై పరుగులు పెడుతుండగానే.. S-4, S-5 కోచ్లు రెండుగా విడిపోయాయి. దీంతో ప్రయాణికులు అంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విపరీతంగా కేకలు వేస్తూ ప్రాణాలు కాపాడమన్నారు. విషయం గుర్తించిన అధికారులు రైలును నిలిపివేశారు.
వెంటనే ఈ రెండు భోగీల్లోని ప్రయాణికులు అందరినీ మరో కోచ్కు తరలించారు. ఆపై రైలు ఎందుకలా విడిపోయిందని తెలుసుకునేందుకు సిబ్బందిని పలిపించారు. ఈక్రమంలోనే రైలు కప్లింగ్ విరిగిపోయిన విషయాన్ని గుర్తించి దాన్ని మళ్లీ అతికించారు. దాదాపుగా నాలుగు గంటల పాటు శ్రమించి సమస్యను పరిష్కరించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
రైలు వేగం తక్కువగా ఉండడం వల్ల తామంతా ప్రాణాలతో బయట పడ్డామని ప్రయాణికులు చెబుతున్నారు. అలాగే మరోసారి ఇలాంటి ప్రమాదాలు తలెత్తకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa