ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుసగా 14వ మ్యాచ్‌లోనూ టాస్ ఓడిన భారత్

sports |  Suryaa Desk  | Published : Tue, Mar 04, 2025, 07:58 PM

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్‌లో భారత్ తొలుత బౌలింగ్ చేయనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా గత మ్యాచుతో పోలిస్తే ఆస్ట్రేలియా రెండు మార్పులతో బరిలోకి దిగింది.ఇక భారత్ మాత్రం.. న్యూజిలాండ్‌తో తలపడ్డ తుది జట్టుతోనే ఆడుతోంది. ఈ మ్యాచ్‌లోనూ భారత్ టాస్ ఓడిపోగా.. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌ తర్వాత ఆడిన అన్ని మ్యాచుల్లోనే భారత్ టాస్ ఓడిపోయింది. వరుసగా 14 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలవలేదు.


పిచ్‌ పొడిగా ఉండటంతోనే ఫస్టు బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయినట్లు మైకెల్ క్లార్క్ వెల్లడించాడు. “బంతి స్పిన్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. భారత్‌ బలమైన జట్టు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టులో 2 మార్పులు చేశాం. గాయపడ్డ మాథ్యూ షార్ట్‌ స్థానంలో కూపర్‌ కన్నోలి వచ్చాడు. స్పెన్సర్‌ జాన్సన్‌స్థానాన్ని తన్వీన్‌ సంఘా భర్తీ చేశాడు” అని స్టీవ్‌ స్మిత్‌ వెల్లడించాడు.


ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా లైవ్ స్కోర్ కార్డు..


ఇక తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయబోమని.. రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. “పిచ్‌ స్వభావం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. ఇక్కడ ఆడిన 3 మ్యాచ్‌లలో మేము రాణించాం. కివీస్‌తో ఆడిన జట్టుతోనే మరోసారి ముందుకు వెళ్తున్నాం” అని రోహిత్ అన్నాడు.


న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పేసర్‌ హర్షిత్‌ రాణాపై వేటు వేసి స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని ఆడించగా.. అతడు 5 వికెట్లతో ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. మరోవైపు సెమీస్‌లోనూ స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అంచనాల నడుమ భారత్‌తో పాటు ఆస్ట్రేలియా కూడా ఎక్కువ మంది స్పిన్నర్లను జట్టులోకి తీసుకుంది.


తుది జట్లు..


భారత్‌:


రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్‌ చక్రవర్తి, మహమ్మద్‌ షమీ, కుల్‌దీప్‌ యాదవ్.


ఆస్ట్రేలియా:


కూపర్ కన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్‌), మార్నస్ లబుషేన్‌, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌ కీపర్‌), అలెక్స్ కేరీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా.


గూగుల్ ట్రెండ్స్‌లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా


ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ బెర్తు కోసం రెండు ప్రధాన జట్లు తలపడుతుండటంతో ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచింది. ఈ మ్యాచ్ అప్‌డేట్స్ కోసం ఎక్కువ మంది క్రికెట్ ప్రియులు సెర్చ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa