ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో కలకలం

Crime |  Suryaa Desk  | Published : Wed, Mar 05, 2025, 11:15 PM

తిరుమల నడక మార్గంలో బుధవారం కలకలం రేగింది. అవ్వాచారికోన లోయలోకి ఓ వ్యక్తి దూకడం కలకలం రేపింది. అలిపిరి మెట్లమార్గంలోని అక్కగార్ల ఆలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆత్మహత్యా యత్నం చేసిన ఆ వ్యక్తి ఎవరనేదీ క్లారిటీ లేదు. ఆత్మహత్యాయత్నం గురించి సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. రెస్క్యూ బృందం సాయంతో లోయలోకి దూకిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఏంటనే విషయాలపై అతని ఆచూకి తెలిస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే అలిపిరి మెట్ల మార్గంలో ఈ ఘటన జరగటంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa