తమ డబ్బులకు మంచి రాబడి రావాలని అందరూ అనుకుంటారు. కొందరు రిస్క్ తీసుకుని స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. మరికొందరు రిస్క్ తీసుకోవాలని అనుకోరు. తక్కువ వడ్డీ వచ్చినా సురక్షితమైన పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. అలాంటి వారందరికీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వీటిలో రిస్క్ ఉండదు. స్థిరమైన వడ్డీ ఆదాయం వస్తుంది. బ్యాంకులు సైతం డిపాజిటర్లను ఆకర్షించేందుకు అధిక వడ్డీ ఆఫర్ చేస్తుంటాయి. కొన్ని బ్యాంకులు తక్కువ టెన్యూర్లపై ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నాయి. అధిక వడ్డీ రేట్లు అందిస్తున్న బ్యాంకుల్లో ఎస్ బ్యాంక్ ఉంది.
ఈ ప్రైవేట్ బ్యాంకు 18 నెలల కాల పరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు 8 శాతం వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు అయితే 50 బేసిస్ పాయింట్లు అదనంగా అంటే 8.5 శాతం మేర వడ్డీ చెల్లిస్తోంది. స్వల్ప కాలిక లాభాల అందుకోవాలని చూస్తున్న డిపాజిటర్లకు ఎస్ బ్యాంక్ అందిస్తున్న 18 నెలల టెన్యూర్ డిపాజిట్ స్కీమ్ మంచి ఎంపిక అవుతుందని చెప్పవచ్చు.
రూ. 5 లక్షలకు ఎంతొస్తుంది..?
జనరల్ పబ్లిక్కు ఈ స్కీమ్ ద్వారా 8 శాతం వడ్డీ ఇస్తోంది. ఇందులో సాధారణ కస్టమర్ రూ. 5 లక్షలు డిపాజిట్ చేశాడు అనుకుందాం. 18 నెలల మెచూరిటీ పూర్తయిన తర్వాత వడ్డీ రూపంలో రూ.63,081 అందుతాయి. మొత్తంగా చేతికి రూ. 5,63,081 వస్తుంది. 60 ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్లకు అయితే ఈ స్కీమ్ ద్వారా 8.50 శాతం వడ్డీ లభిస్తోంది. సీనియర్ సిటిజన్లు రూ. 5 లక్షలు ఎఫ్డీ చేసినట్లయితే 18 నెలల తర్వాత చేతికి రూ. 5,67,234 వస్తాయి. అంటే వడ్డీ రూపంలోనే రూ. 67 వేలకుపైగా వస్తాయి. అయితే మెచూరిటీ సమయం ముగియక ముందే ప్రీమెచ్యూర్ విత్ డ్రా చేస్తే వడ్డీ తగ్గిపోతుంది. పెనాల్టీలు విధిస్తాయి బ్యాంకులు. పైన చెప్పిన విధంగా లాభాలు ఉండవు. ఎస్ బ్యాంకులో 7 రోజుల నుంచి 10 ఏళ్ల టెన్యూర్ వరకు అత్యధిక వడ్డీ రేటు 8.50 శాతంగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa