జ్యోతీక్షేత్రంలో కేంద్ర అటవీశాఖ అనుమతులు లేకుండా భవనాలు నిర్మించారంటూ శుక్రవారం ఉన్నతాధికారుల ఆదేశాలతో అటవీశాఖ అధికారులు కూల్చివేశారు. పోరుమామిళ్ల ఫారెస్ట్ రేంజి ఆఫీసర్ రఘునాధరెడ్డి తన సిబ్బందితో కలిసి ఎక్స్కవేటర్తో కూల్చివేశారు. కాగా మఠం సమీపంలోని అఛలానంద పీఠాధిపతి నీరజానందస్వామి ఇతర భక్తులు నిర్మాణాలు కూల్చవద్దంటూ కొంత సమయం ఇవ్వాలని అధికారులను వేడుకున్నప్పటికి ఫలితం లేకుండా పోయింది. పోరుమామిళ్ల సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తుమధ్య కళ్యాణకట్ట, సమీపంలోని ఇతర భవనాల కూల్చివేత కార్యక్రమం కొనసాగించారు. కాశినాయన జ్యోతిక్షేత్రంలో ఇప్పటికే రెండు సార్లు భవనాలు కూల్చారని ఇది మూడవసారి అని భక్తులు,పలువురు పీఠాధిపతులు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మేల్గొని ఇలాంటి కూల్చివేతలు జరగకుండా అధికారులకు స్వష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. నర్సాపురం ఏఎస్ఐ రమణ, పోలీసులు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa