ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలు సమానత్వం సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 08, 2025, 12:12 PM

మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ప్రొద్దుటూరు డీఎస్పీ పి.భావన పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని శుక్రవారం జిల్లా పోలీసు శాఖ, సంస్కృతి స్వచ్ఛంద సేవా సంస్థ, వికసిత ఫౌండేషన్‌ ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎస్వీ డిగ్రీ కళాశాల, వాగ్దేవి ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులతో గీతాశ్రమం నుంచి పుట్టపర్తి సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో సంస్కృతి స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, డాక్టర్‌ వరుణ్‌కుమార్‌రెడ్డి, వికసిత ఫౌండేషన్‌ అధ్యక్షురాలు శూలం లక్ష్మిదేవి, ఎస్వీ డిగ్రీ కళాశాల కోఆర్డినేటర్‌ గౌరీశంకర్‌, దావీదు, మౌనయ్య, హేమలత, విమల, పాల్గొన్నారు. పురుషులతో సమానంగా మహిళలు సమానత్వం సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యమని ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్‌బేగం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, జేవీవీ రాష్ట్ర కార్యదర్శి తవ్వా సురేష్‌లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని శుక్రవారం సీఐటీయూ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు పురోగమిస్తున్నా ఇప్పటికి వారిపై అత్యాచారాలు, వేదింపులు, అధికమవుతుండడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బాలసుబ్బయ్య, రాఘవ, ఐద్వా పట్టణ కార్యదర్శి వెంకటసుబ్బమ్మ, సర్వేశ్వరి, రాములమ్మ, లక్ష్మిదేవి, నాగలక్ష్మి, జయమ్మ, కళావతి, దుర్గ, పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa