ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎదురొచ్చిన పిల్లిని సజీవ దహనం చేసిన మహిళలు

national |  Suryaa Desk  | Published : Mon, Mar 10, 2025, 10:37 PM

ఉత్తర ప్రదేశ్‌లోని మోరాబాద్ జిల్లా భోజ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాలని ప్లాన్ చేసింది. ఈక్రమంలోనే తన స్నేహితురాళ్ల ఇద్దరినీ తీసుకుని బైకుపై వెళ్లింది. అయితే రోడ్డు దాటుతుండగా.. హఠాత్తుగా అటువైపు ఓ పిల్లి వచ్చింది. పిల్లి ఎదురు రావడంతో.. అపశకునంగా భావించిన వాళ్లు తమకు ఏదైనా అరిష్టం జరుగుతుందని అనుకున్నారు. అలా అని వాళ్లు తమ పనిని వాయిదా వేసుకుంటే అయిపోయేది. కానీ వాళ్లలా ఆలోచించలేదు. పిల్లిని చంపేస్తే తమకు ఏమీ జరగదని అనుకుని.. దాన్ని చంపాలనుకున్నారు.


ఈక్రమంలోనే మహిళలు అంతా కలిసి రోడ్డు దాటి మరీ పిల్లిని వెంబడించి పట్టుకున్నారు. ఆపై అది బతికుండగానే నిప్పు పెట్టి సజీవ దహనం చేశారు. ఈ దారుణం అంతా జరుగుతుండగా.. ఓ మహళ దీన్ని వీడియోగా తీసింది. దీన్ని సోషల్ మీడియాలో పెట్టకపోయినా తెలిసిన వాళ్లకు పంపించగా.. ఆపై ఇది కాస్తా వైరల్ అయింది. దీన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న ఓ వ్యక్తి మెయిల్ ద్వారా ఈ వీడియోను షేర్ చేస్తూ.. ఢిల్లీలోని వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోకి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజీ ద్వారా బైక్ నంబర్‌ను పోలీసులు ట్రేస్ చేసి నిందితులను గుర్తించారు. పిల్లిని కాల్చి చంపిన మహిళ ప్రియ అని.. మిగతా వాళ్లు ఆమె స్నేహితులు అని తెలుసుకున్నారు. వన్య ప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ల కింద వారిపై కేసులు కూడా నమోదు చేశారు. దోషులుగా తేలితే మూడేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా కూడా విధించే అవకాశం ఉందని పోలీసు అధికారి వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa