రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ అడుగడుగునా రైతులను మోసం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు పెట్టుబడి సాయం లేదు, మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక రైతన్నలు కుదేలవుతున్నా ఈ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఆమె మాట్లాడుతూ.... శాసనమండలిలో ఈ రోజు వ్యవసాయంపై జరిగిన లఘు చర్చల్లో రైతున్నల పట్ల కూటమి ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య దోరణి బయటపడింది. రైతులను ఆదుకోవడంలో, అండగా నిలవడంలో ఈ ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యింది. ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు మేనిఫేస్టోలో చాలా స్పష్టంగా అన్నదాత సుఖీభవ పేరుతో పెట్టుబడి సాయంగా ప్రతి రైతుకు ఏటా రూ.20 ఇస్తామని చెప్పారు. దానిలో ఆరువేల రూపాయలు కేంద్రం ఇస్తుంది, మిగిలిన రూ.14 వేలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు తాజాగా బడ్జెట్లో కేటాయింపుల్లో కేంద్రం ఇచ్చే దానితో కలిపి అని చెప్పడం రైతులను మోసం చేయడమే అని వాపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa