ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 12, 2025, 09:56 AM

మార్చి 12, 2011న ఇడుపుల‌పాయ‌లో ఒక్క‌డితో ఆవిర్భ‌వించిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు ప్ర‌భంజ‌నంలా మారింది. ఎన్ని శ‌క్తులు ఏక‌మై కుట్ర‌లు ప‌న్నినా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎదురొడ్డి నిల‌బ‌డ్డారు . మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన లక్ష్యంగా ఏర్పాటైన పార్టీ విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త‌తో ప్ర‌జ‌లకు ద‌గ్గ‌రైంది. ప్ర‌తిప‌క్షమైనా, అధికార ప‌క్ష‌మైనా ప్ర‌జ‌ల అభిమ‌త‌మే ధ్యేయంగా ప‌ని చేస్తోంది. ఎన్ని పార్టీలు ఏక‌మై వ‌చ్చినా..ప్ర‌జాబ‌లంతో వైయ‌స్ జ‌గ‌న్ ఒక్కే ఒక్క‌డిగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించిన ఏడాదికే 17 అసెంబ్లీ, ఓ ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌..2014 మేలో జరిగిన ఎన్నికల్లో 67 స్థానాల్లో గెలిచి.. ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత రైతు భరోసా యాత్ర, ఏపీకి ప్రత్యేక హోదాపై ఢిల్లీలో చేపట్టిన ధర్నా వంటి కార్యక్రమాల‌తో ప్ర‌జాభిమానాన్ని కూడ‌గ‌ట్టారు.2019 మే 30న ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.


తొలి మంత్రివర్గంలో 56 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి.. ఐదు డిప్యూటీ సీఎం పదవుల్లో నాలుగు ఆ వర్గాలకే ఇచ్చారు. హోంశాఖ మంత్రిగా తొలిసారిగా ఎస్సీ మహిళను నియమించి సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. నామినేటెడ్‌ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. మహిళలకు రిజర్వు చేసేలా చట్టం తెచ్చి మరీ ఆ వర్గాలకు పదవులు ఇచ్చారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ, స్థానిక సంస్థల పదవుల్లోనూ ఆ వర్గాలకే పెద్దపీట వేశారు. 2022 ఏప్రిల్‌ 11న పునర్‌వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చి సామాజిక మహా విప్లవాన్ని సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆవిష్కరించారు. దీంతో వరుసగా జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఉప ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ ఘన విజయం సాధించి తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది.  ఈనెల  12వ తేదీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా రాష్ట్రంలోని ప‌ల్లె ప‌ల్లెలో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలి.  ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగురవేయాలి. ప్రజల్లో వైయస్‌ఆర్‌సీపీకి ఉన్న బలాన్ని చాటుకోవాలి. పార్టీ పట్ల సానుభూతితో ఉన్న శ్రేణులను ఆవిర్భావ వేడుకల్లో భాగస్వాములను చేయాలి. ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను నిలబెట్టుకుంటూ, రానున్న రోజుల్లో వారికి అండగా ఉంటామనే భరోసాను కల్పించాలి` అని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa