ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాట్లాడొద్దంటే వెళ్లిపోతానంటూ అసహనం వ్యక్తపరిచిన విష్ణుకుమార్‌ రాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 13, 2025, 10:47 AM

వివిధ శాఖల గ్రాంట్ల అమోదం కోసం అసెంబ్లీలో జరిగిన చర్చలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, బీజేపీ ప్లోర్‌లీడర్‌ విష్ణుకుమార్‌ రాజు మధ్య కొంత మాటల యుద్ధం నడిచింది. కార్మికులు, పరిశ్రమల తీరుపై విష్ణు మాట్లాడుతున్న సమయంలో కాలవ శ్రీనివాసులు కొంచెం త్వరగా ముగించాలని కోరారు. సమయం సాయంత్రం 4.50 కావస్తోందని, 5గంటలకు సభ ముగించాల్సి ఉండటంతో సమయాన్ని కూడా చూడాలని, రోజూ మాట్లాడుతున్నారు కదా అని కాలవ సూచించారు. 2 నిమిషాల్లో ముగించాలని డిప్యూటీ స్పీకర్‌ కూడా కోరినా విష్ణుకుమార్‌ రాజు సుదీర్ఘంగా వివరించే ప్రయత్నం చేయడంతో త్వరగా ముగించాలని కాలవ మరోసారి అన్నారు. దీనిపై విష్ణుకుమార్‌ రాజు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ హోదాలో తాను మాట్లాడుతున్నానని, ఎంతసేపు మాట్లాడాలో మీరే చెప్పాలన్నారు. మాట్లాడొద్దంటే వెళ్లిపోతానని గట్టిగా చెప్పారు. స్పీకర్‌ కల్పించుకుని సభ్యులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని సూచించడంతో ఇద్దరూ శాంతించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa