ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన గుడివాడ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 13, 2025, 06:23 PM

వైయస్ జ‌గన్ కోట‌రీ అంటే అది ఆయనను అభిమానించే ప్రజలు, 15 ఏళ్లుగా పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌లేనని విశాఖ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌ స్పష్టం చేశారు. విశాఖపట్నం వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.  నిన్నటి వరకు వైయస్ జగన్ కోటరీలోనే ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. వైయస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడుగా ఆయన మాటల్లోనే చెప్పాలంటే పూజారిగా ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఎలా వ్యవహరించారో ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa