ఉద్యోగులకు బిగ్ అలర్ట్. కంపెనీల యాజమాన్యాలు తమ ఉద్యోగుకు ఇ-మెయిల్స్ పంపిస్తున్నాయి. ట్యాక్స్ సేవింగ్ పెట్టుబడులు లేదా ఖర్చులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని కోరుతున్నాయి. పన్ను ఆదా చేసుకోవాలనుకునే ఉద్యోగులు ఆయా పత్రాలను తప్పనిసరిగా కంపెనీ యాజమాన్యాలకు సమర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా వేతనంపై ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ (టీడీఎస్) కట్ చేస్తుంటాయి కంపెనీలు. ట్యాక్స్ ఆదా పెట్టుబడుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించడం ద్వారా ఫుల్ టీడీఎస్ తప్పించుకోవచ్చు. ఉద్యోగులు ఈ పత్రాలను సమర్పించేందుకు మార్చి నెల చివరి వరకు అవకాశం ఉంటుంది. మార్చి 31లోపు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. ఎవరైతే ట్యాక్స్ సేవింగ్ పెట్టుబడులు పెట్టి పన్ను ఆదా చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ వెంటనే ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. అయితే కంపెనీలోని ఉద్యోగులందరూ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. అయితే మరి ఎవరు ఇవ్వాలో తెలుసుకుందాం.
ఎవరు పత్రాలు సమర్పించాలి?
ప్రముఖ ఛార్టర్జ్ అకౌంటెంట్ ప్రకారం.. ఉద్యోగులు ఎవరైతే పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటారో వారు పన్ను మినహాయింపులు, డిడక్షన్లు కావాలనుకుంటారో వారందరూ పెట్టుబడి ధ్రువీకరణ పత్రాలను కంపెనీ యాజమాన్యాలకు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే కొత్త పన్ను విధానం ఎంచుకున్న ఉద్యోగులు పన్ను ఆదా పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొత్త పన్ను విధానంలో ఎలాంటి మినహాయింపులు ఉండవు. నేరుగా రూ.12 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదని కేంద్రం ఇటీవలే వెల్లడించింది.
ఎలాంటి పత్రాలు సమర్పించాలి?
ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని పాత పన్ను విధానంలో వివిధ రకాల పన్ను మినహాయింపులు, డిడక్షన్లు ఉంటాయి. ట్యాక్స్ పేయర్లు తమ మొత్తం పన్ను ఆదాయంలో మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు. దీంతో చెల్లించాల్సిన పన్ను తగ్గుతుంది. మీరు పాత పన్ను విధానం ఎంచుకున్నట్లయితే వివిధ రకాల పెట్టుబడులు, రుణాల వడ్డీ చెల్లింపులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించి ట్యాక్స్ భారం తగ్గించుకోవచ్చు. ఆ జాబితాలో హౌస్ రెంట్ అలవెన్స్, సెక్షన్ 80సీ డిడక్షన్ ప్రూఫ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం డిడక్షన్, సెక్షన్ 24బీ వడ్డీ డిడక్షన్లు, అదనపు జాతీయ పెన్షన్ స్కీమ్ డిడక్షన్లు వంటివి ఉన్నాయి.
![]() |
![]() |