ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ సర్కారు ప్రజలను దోచుకుంటోంది..: మల్లికార్జున ఖర్గే

national |  Suryaa Desk  | Published : Mon, Mar 17, 2025, 10:35 PM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడి చమురు ధరలు తగ్గినా దాని ప్రయోజనాలను ప్రజలకు అందించడంలో సర్కారు విఫలం అవుతుందని అన్నారు. ముఖ్యంగా 42 నెలల కనిష్టానికి ముడి చమురు ధరలు పడిపోయినా.. ఇప్పటికే ప్రభుత్వం ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూనే ఉందన్నారు. ఇలా దేశ ప్రజలు అందరినీ మోదీ సర్కారు దోచుకుంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


ముడి చమురు ధరలు నిరంతరం తగ్గుతూనే ఉన్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గట్లేదని చెప్పారు. 2014 మే నుంచి సుమారు 34 శాతం తగ్గాయని.. పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం 36 లక్షల కోట్ల రూపాయల పన్ను వసూలు చేసిందని వివరించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు కన్నీరు పెడుతున్నారని చెప్పారు. ఇంకా ఈ దోపిడీ ఎంతకాలం కొనసాగుతుందంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐ పరిశోధకుడు మరియు పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ పాల్గొనగా.. దాన్ని తీవ్రంగా విమర్శించారు ఖర్గే. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌ను ప్రజలకు సుదీర్ఘమైన ఏకపక్ష పాడ్‌కాస్ట్‌ల ద్వారా మాత్రమే చెబుతారన్నారు.


అలాగే కేంద్ర ప్రభుత్వం త్వరలో అమల్లోకి తేబోతున్న లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభజన అంశంపై కూడా స్పందించారు. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం చేస్తుందని చెప్పారు. దేశ వనరులు, పాలనలో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం ఉండాలని అన్నారు. జనాభా ఆధారంగా నియోజక వర్గాల పునర్విభజన చేయడం వల్ల దక్షిణాదిలో ఎంపీ సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఉత్తరాదిలో ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. దీని వల్ల దేశంలో సమన్యాయం లేకుండా పోతుందని మల్లికార్జున్ ఖర్గే వివరించారు. ఇలాంటివి జరగకుండా సమాజిక సమానత్వం కోసం అంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa