ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఔరంగాజేబు సమాధి వద్ద భద్రత పెంపు.. సంతకాలు చేసి ఐడీ కార్డు చూపిస్తేనే లోపలికి అనుమతి

national |  Suryaa Desk  | Published : Mon, Mar 17, 2025, 10:36 PM

మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు సమాధిని కూల్చి వేయాలంటూ విశ్వహించూ పరిషత్ సహా పలు ప్రభుత్వ కార్యాలయాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు పోలీస్ భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా ఔరంగాజేబు సమాధి వద్దకు వెళ్లాలనుకునే సందర్శకులకు పలు ఆంక్షలు విధించింది. ఇకపై అక్కడికి వెళ్లాలంటే ఐడీ కార్డులు వెంట తీసుకెళ్లడంతో పాటు సిబ్బంది వద్ద ఉన్న రిజిస్టర్ లో సంతకాలు చేయాల్సి ఉంటుందని చెప్పింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


మరాఠా యోధుడు, రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జంయతి మద్దతుదారులతో పాటు బజరంగ్ దళ్ నేతృత్వంలోని మితవాద సంస్థలు అన్నీ.. మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు సమాధిని కూల్చి వేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. బాబ్రీ మసీదు తరహాలోనే.. విశ్వహిందూ పరిషత్ సహా పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టారు. అలాగే మెమోరాండాలను సమర్పించారు. అంతేకాకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు ఇచ్చిన మెమోరాండంలో కూడా పలు అంశాలను ప్రస్తావించింది.


మత మార్పిడికి నిరాకరించారన్న నెపంతో సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ ఇద్దరు కుమారులను ఔరంగాజేబు హత్య చేశారని అందులో వివరించారు. అంతేకాకుండా మరాఠా యోధుడు థత్రపతి శంభాజీ మహారాజ్ ను హింసించి చంపారని పేర్కొన్నారు. అలాగే పలు హిందూ ఆలయాలను కూడా ధ్వంసం చేశారని వినతి పత్రంలో వెల్లడించారు. అందుకే ఔరంగాజేబు సమాధిని పూర్తిగా కూల్చి వేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సర్కారు చర్యలు తీసుకోకపోతే.. తామే ఆ సమాధి వరకు మార్చ్ నిర్వహించి ఆపై కూల్చి వేస్తామని హెచ్చరించారు.


దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ముఖ్యంగా ఔరంగాజేబు సమాధి వద్ద పోలీసు భద్రతను పెంచింది. ప్రవేశ్ ద్వారం నుంచి సమాధి స్థలం వరకు పలు సెక్యూరిటీ పోస్టులను ఏర్పాటు చేసింది. మొత్తంగా 50 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసింది. అందులో 20 మంది స్థానిక పోలీసులు ఉండగా.. మరో 20 మంది రిజర్వ్ పోలీసులు ఉన్నట్లు అధికారులు వివరిస్తున్నారు. అలాగే అక్కడకు వచ్చే సందర్శకులపై కూడా ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు.


ఇక నుంచి ఎవరైనా అక్కడకు వస్తే.. భద్రతా సిబ్బంది వద్ద ఉన్న రిజిస్టర్ లో సంతకాలు చేయాలని.. అలాగే గుర్తింపు పత్రాలను సైతం చూపించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. లేని పక్షంలో లోపలికి అనుమతించమని చెబుతున్నారు. ఈ గొడవల నేపథ్యంలోనే అక్కడికి సందర్శకుల తాకిడి పూర్తిగా తగ్గిపోయింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa