భారత దేశంలోని అమ్మాయిలు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలు చేయరనే భావన.. ఇటీవల కాలంలో నీరుగారుపోయిందని కేరళ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అత్యాచారం, లైంగిక వేధింపులు, ఇతర దుష్ప్రవర్తన ఫిర్యాదులు వస్తుండగా.. చాలా శాతం ఎలాంటి ఆధారాలు లేకుండానే వస్తున్నాయని చెప్పింది. అంతేకాకుండా పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న ఓ యువకుడిపై కేసును కొట్టివేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
2014 మే 30వ తేదీ నుంచి 2019 ఏప్రిల్ 20వ తేదీ మధ్య కాలంలో పట్టాంబికి చెందిన ఓ యువకుడు తనను పెళ్లి చేసుకుంటానంటూ హామీ ఇచ్చి లైంగింక దోపిడీకి పాల్పడ్డాడంటూ ఓ అమ్మాయి కోర్టుకు వెళ్లింది. అయితే ఈ కేసును విచారించిన కేరళ హైకోర్టు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సదరు యువకుడిపై కేసును కొట్టివేస్తూ.. జస్టిస్ ఎ బధరుద్దీన్ ఆశ్చర్యకర కామెంట్లు చేశారు. భారత సమాజంలో ఏ అమ్మాయి కూడా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలు చేయదనే భావన ఇటీవలి సంవత్సరాల్లో నీరుగారిపోయిందని వివరించారు.
వ్యక్తిగత కక్షలతో కొందరు చట్టవిరుద్ధమైన డిమాండ్లు తీర్చుకోవడానికి.. నిందితులపై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ కోర్టును ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఏ అమ్మాయి కూడా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తప్పుగా ఆరోపణలు చేయదనే నమ్మకంతో... సత్యాన్ని ధ్రువీకరిచకుండా తీర్పులు చెప్పకూడదని వెల్లడించారు. ఈ పిటిషన్ను పరిశీలించినప్పుడు.. 2014 మే 30వ తేదీనే నేరం జరిగినప్పటికీ.. కేసును 2019 ఏప్రిల్లో నమోదు చేశారని అన్నారు.
ఫిర్యాదుదారు మహిళ 2016లో పాలక్కాడ్డ్ లోని మహిళా సెల్లో.. సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. కానీ అతడు ఆమెను వివాహం చేసుకుంటానని మాట ఇవ్వడంతో ఆ కేసును వెనక్కి తీసుకుందని జస్టిస్ ఎ బధరుద్దీన్ వెల్లడించారు. వీరిద్దరి మధ్య బంధంపై వారికి ఏకాభిప్రాయం ఉందని చెప్పారు. అలాంటప్పుడు అతడు లైంగిక దోపిడీకి ఎలా పాల్పడతాడంటూ ప్రశ్నించారు. కావాలనే మహిళ తప్పుడు ఆరోపణలు చేస్తోందంటూ కేసును కొట్టివేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa