వాలంటీర్లకు రూ.10 వేల వేతనం ఇస్తామని ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు ..సీఎం కాగానే మోసం చేశారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్ అయ్యారు. 2023 ఆగస్టు నుండి వలంటీర్లు వ్యవస్థ లేదని మంత్రి దారుణంగా మాట్లాడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఈ వ్యవస్థ లేకపోతే 2024లో మేనిఫెస్టోలో ఎలా పెట్టారని ప్రశ్నించారు. 2024 ఏప్రిల్ లో ఎన్నికల్లో ఊరూరా తిరిగి వాలంటీర్ల జీతాలు పెంచుతామని ఎలా హామీ ఇచ్చారని నిలదీశారు. జీతం పెంచగానే చించినాడా పుతారేకులు ఇవ్వండి అని మంత్రి ప్రచారం చేశారని ఎద్దేవా చేశారు. 2,60,000 వేల మందిని తొలగించడం అన్యాయమని, వాళ్ళు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారని కళ్యాణి ఆందోళన వ్యక్తం చేశారు. వలంటీర్లు లేకపోతే ఎందుకు విపత్తు శాఖ ఆదేశాలు ఇచ్చిందని, లేని వారిని ఎలా వరదల్లో వినియోగించారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa